బాబాయ్ మర్డర్ కేసులో పీకల్లోతున కూరుకుపోయిన అవినాశ్ రెడ్డి అందులోంచి బయటపడడం కష్టమేనని సీఎం జగన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఇలాంటి ఇష్యూస్లో సాయం చేసేది లేదన్న సమాధానం రావడంతోపాటు.. తమ్ముడిని కాపాడుకోవడం కంటే కడప లోక్ సభ సీటు కాపాడుకోవడంపై దృష్టిపెట్టమని సెంటర్ నుంచి సజెషన్ రావడంతో ఇప్పుడు జగన్ రెడ్డి ఆ పనిలో పడ్డారు. దీంతో పీకల్లోతున కూరుకుపోయిన బ్రదర్ అవినాశ్ రెడ్డిని ఆ ఊబిలోంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో ఒళ్లంతా బురద అంటించుకోవడం కంటే ఆయన మానాన ఆయన్ను వదిలి కొత్త తమ్ముడిని కడపకు తేవాలని జగన్ డిసైడయ్యారన్నది ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ద తాడేపల్లి’.
అవినాశ్ రెడ్డికి అన్ని దారులూ మూసుకుపోవడంతో కాస్త ఆలస్యమైనా కానీ అరెస్ట్ తప్పని పరిస్థితి. ఒకవేళ శిక్ష ఖరారై జైలుకు వెళ్తే ఎంపీ పదవి వదులుకోవాలి. ఇదందా చకచకా జరిగిపోతే బై ఎలక్షన్లు గ్యారంటీ.. ఒకవేళ ఆలస్యమైనా వచ్చే ఎన్నికల నాటికి ఇదింత మరింత పెద్ద ఇష్యూగా మారే ప్రమాదం ఉంది. ఎలాగైనా కడప లోక్సభ సీటుకు కొత్త క్యాండిడేట్ కావాలి. ఆ కొత్త క్యాండిడేటే దుష్యంత్ రెడ్డి అని కడపలోను, తాడేపల్లిలోనూ వినిపిస్తోంది.
కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ రెడ్డి స్వగ్రామం. కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో బాగా తెలుసు. 2019లో జమ్మలమడుగు వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారు. 20019లోనే దుష్యంత్ రెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తారని.. కడపలో అవినాశ్ రెడ్డికి టికెట్ ఇస్తే నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన ప్లేసులో దుష్యంత్ ను తీసుకురానున్నారని టాక్. అన్నట్లు.. దుష్యంత్ కూడా జగన్కు సమీప బంధువే. వరుసకు తమ్ముడు అవుతారట.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…