ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఇప్పటికే అధినేత జగన్ సిట్టింగుల జాతకాలను బట్టే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత.. మళ్లీ కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన మాట మార్చుకుని.. అందరికీ అవకాశం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మరో వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇది అంతర్గత చర్చే అయినా.. పార్టీలో మాత్రం సెగలు పుట్టిస్తోంది.
పత్తికొండ, నెల్లూరు రూరల్, ఆత్మకూరులోనూ.. మార్పులు తప్పవని అంటున్నారు. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మార్పులు ఖాయమని తెలిసిపోయింది. గిద్దలూరు, గూడూరు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, రేపల్లె నియోజకవర్గాల్లో మర్పు లు ఖాయమని వైసీపీలో చర్చసాగుతోంది. ఇక్కడ కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. పార్టీలో ఉన్నవారినే తీసుకుంటారా? లేక.. బయట నుంచి కూడా ఎవరినైనా తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ఇక, టీడీపీ విషయంలోనూ ఇదే చర్చసాగుతోంది.
ఎన్నికల సమయానికి గెలుపుగుర్రాలుగా భావించే నేతలను పట్టాలెక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీరిలో కొత్తవారు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా.. ప్రస్తుతం పార్టీకి దన్నుగా ఉన్న నాయకులను కూడా లెక్కల్లోకి తీసుకుని.. వారితో ఎన్నికలకు వెళ్లాలనేది.. చంద్రబాబు వ్యూహంగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సీనియర్లకు యథాతథంగా సీట్లు దక్కనున్నాయనేది ఖాయమని చెబుతున్నారు.
ఎలా చూసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆమోదం ఉన్న నాయకులకు పట్టం కడతారని తెలుస్తోంది. ఇక, మరోవైపు.. ఇప్పటికే ఆశావహులుగా ఉన్న వారసుల విషయంపైనా..చంద్రబాబు దృష్టి పెట్టారు. వీరిలో ఎంతమంది గెలుపు గుర్రాలు ఎక్కుతారు.. ? ఎంత మంది కేవలం టికెట్ల రేసులో ఉన్నారనేది కూడా ఆయన నిశితంగా గమనిస్తున్నారు. పైపైన మాటలు చెప్పి టికెట్లు ఇవ్వమంటేనో.. సిఫారసులు చేయించుకుని వస్తేనో.. ఈ సారి టికెట్ కష్టమేనని మొహంపైనే చెప్పేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు పార్టీల్లోనూ కొత్త ముఖాలు ఖాయమనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 29, 2023 6:32 am
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…