ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఇప్పటికే అధినేత జగన్ సిట్టింగుల జాతకాలను బట్టే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత.. మళ్లీ కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన మాట మార్చుకుని.. అందరికీ అవకాశం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మరో వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇది అంతర్గత చర్చే అయినా.. పార్టీలో మాత్రం సెగలు పుట్టిస్తోంది.
పత్తికొండ, నెల్లూరు రూరల్, ఆత్మకూరులోనూ.. మార్పులు తప్పవని అంటున్నారు. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మార్పులు ఖాయమని తెలిసిపోయింది. గిద్దలూరు, గూడూరు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, రేపల్లె నియోజకవర్గాల్లో మర్పు లు ఖాయమని వైసీపీలో చర్చసాగుతోంది. ఇక్కడ కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. పార్టీలో ఉన్నవారినే తీసుకుంటారా? లేక.. బయట నుంచి కూడా ఎవరినైనా తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ఇక, టీడీపీ విషయంలోనూ ఇదే చర్చసాగుతోంది.
ఎన్నికల సమయానికి గెలుపుగుర్రాలుగా భావించే నేతలను పట్టాలెక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీరిలో కొత్తవారు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా.. ప్రస్తుతం పార్టీకి దన్నుగా ఉన్న నాయకులను కూడా లెక్కల్లోకి తీసుకుని.. వారితో ఎన్నికలకు వెళ్లాలనేది.. చంద్రబాబు వ్యూహంగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సీనియర్లకు యథాతథంగా సీట్లు దక్కనున్నాయనేది ఖాయమని చెబుతున్నారు.
ఎలా చూసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆమోదం ఉన్న నాయకులకు పట్టం కడతారని తెలుస్తోంది. ఇక, మరోవైపు.. ఇప్పటికే ఆశావహులుగా ఉన్న వారసుల విషయంపైనా..చంద్రబాబు దృష్టి పెట్టారు. వీరిలో ఎంతమంది గెలుపు గుర్రాలు ఎక్కుతారు.. ? ఎంత మంది కేవలం టికెట్ల రేసులో ఉన్నారనేది కూడా ఆయన నిశితంగా గమనిస్తున్నారు. పైపైన మాటలు చెప్పి టికెట్లు ఇవ్వమంటేనో.. సిఫారసులు చేయించుకుని వస్తేనో.. ఈ సారి టికెట్ కష్టమేనని మొహంపైనే చెప్పేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు పార్టీల్లోనూ కొత్త ముఖాలు ఖాయమనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 29, 2023 6:32 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…