ఏపీలో అడుగు పెట్టే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన తర్వాత.. తొలి అడుగు మహారాష్ట్రలో వేసి.. భారీ బహిరంగం సభ పెట్టారు. తర్వాత.. అందరూ అనుకున్నది మలి అడుగు కేసీఆర్ ఏపీలోనే వేస్తారని! కానీ.. కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు.
అంటే.. ఏపీని వదిలేసుకున్నట్టు కాదు. ఆచి తూచి వ్యవహరిస్తున్నారు అంతే! పార్టీ పరంగా చూసుకుంటే.. కేసీఆర్కు కావాల్సింది.. అసెంబ్లీ సీట్లు కాదు. వచ్చినా ఇబ్బంది లేదు. పార్లమెంటు స్థానాలపైనే ఆయన కు ప్రత్యేకంగా దృష్టి ఉంది. అలా.. తమకు కలిసి వచ్చే స్థానాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని సమాచారం ఇలా చూసుకుంటే.. సీమ రాజకీయాలపై కేసీఆర్ ముద్ర వేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
సీమలోని నాలుగు జిల్లాలను కలిపి .. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఉంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. అంటే.. తన అడుగు ఏపీలో వేయాల్సి ఉంటే.. అది సీమ గడ్డపైనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో కారణం కూడా.. ఉంది. అనేక మంది నాయకులకు గుర్తింపు కూడా లేకపోవడంతో వారంతా ఎదురు చూస్తున్నారు.
బైరెడ్డి రాజశేఖర్ వంటివారు.. తులసిరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఇలా అనేక మంది నాయకులు వేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. వీరు పాతకాపులే అయినా.. ప్రస్తుతం పుంజుకునేందుకు వీరు తురుపు ముక్కలుగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. అంటే.. కేసీఆర్ కనుక ఏపీపైదృష్టిపెట్టి సీమపై అడుగు పెడితే.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…