ఏపీలో అడుగు పెట్టే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన తర్వాత.. తొలి అడుగు మహారాష్ట్రలో వేసి.. భారీ బహిరంగం సభ పెట్టారు. తర్వాత.. అందరూ అనుకున్నది మలి అడుగు కేసీఆర్ ఏపీలోనే వేస్తారని! కానీ.. కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు.
అంటే.. ఏపీని వదిలేసుకున్నట్టు కాదు. ఆచి తూచి వ్యవహరిస్తున్నారు అంతే! పార్టీ పరంగా చూసుకుంటే.. కేసీఆర్కు కావాల్సింది.. అసెంబ్లీ సీట్లు కాదు. వచ్చినా ఇబ్బంది లేదు. పార్లమెంటు స్థానాలపైనే ఆయన కు ప్రత్యేకంగా దృష్టి ఉంది. అలా.. తమకు కలిసి వచ్చే స్థానాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని సమాచారం ఇలా చూసుకుంటే.. సీమ రాజకీయాలపై కేసీఆర్ ముద్ర వేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
సీమలోని నాలుగు జిల్లాలను కలిపి .. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఉంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. అంటే.. తన అడుగు ఏపీలో వేయాల్సి ఉంటే.. అది సీమ గడ్డపైనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో కారణం కూడా.. ఉంది. అనేక మంది నాయకులకు గుర్తింపు కూడా లేకపోవడంతో వారంతా ఎదురు చూస్తున్నారు.
బైరెడ్డి రాజశేఖర్ వంటివారు.. తులసిరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఇలా అనేక మంది నాయకులు వేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. వీరు పాతకాపులే అయినా.. ప్రస్తుతం పుంజుకునేందుకు వీరు తురుపు ముక్కలుగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. అంటే.. కేసీఆర్ కనుక ఏపీపైదృష్టిపెట్టి సీమపై అడుగు పెడితే.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…