Political News

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా వైసీపీ ఓట‌మి ఖాయం: చంద్ర‌బాబు

రాష్ట్రాన్ని కాపాడటానికి 5 కోట్ల మంది ఒకటి కావాలన‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి పట్టుకుని జగన్ను దించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రలోబాలు కాదని, ప్రజలు టీడీపీని గెలిపించారని తెలిపారు. ‘వై నాట్ కుప్పం’ అన్న వారికి పులివెందులలో జెండా ఎగరేసి సమాధానం చెప్పామని గుర్తుచేశారు.

బీసీ యువకుడు చనిపోతే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని చంద్రబాబు ఆరోపించారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనం ఇవ్వలేని సంక్షేమం ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అమరావ తి నిర్మాణం పూర్తయితే మీ ఆదాయం పెరిగేదని చంద్రబాబు వెల్లడించారు. తెలివిలేనివాళ్లు అధికారం లోకి వస్తే దోపిడీ తప్ప మరేమీ ఉండదని చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా మేడికొండూరులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానని అన్నారు. కానీ ప్రజలు జగన్ మాట లు విని మోసపోయారని పేర్కొన్నారు. చివరికి రాజధాని ఉన్న తాడికొండలోనూ వైసీపీని గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నా రు. రాజధాని రైతులు చేస్తోంది ధర్మపోరాటమన్న చంద్రబాబు.. జగన్ ఆడుతున్న మూడుముక్కలాట సాగదని హెచ్చరించారు.

కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు కూలి పనుల కోసం వచ్చిన వారిని కలిశాననీ.. వారి బాధలు నన్ను కలచివేసాయని చంద్రబాబు వెల్లడించారు. ప్ర‌తి ఒక్క‌రినీ తాను అధికారంలోకి రాగానే ఆదుకుం టాన‌ని చెప్పారు. మ‌రొక్క ఏడాది భ‌రించాల‌ని పిలుపునిచ్చారు. కాగా, చంద్ర‌బాబు కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు పోటెత్తారు.

This post was last modified on April 29, 2023 6:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

1 hour ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago