రాష్ట్రాన్ని కాపాడటానికి 5 కోట్ల మంది ఒకటి కావాలనని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి పట్టుకుని జగన్ను దించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రలోబాలు కాదని, ప్రజలు టీడీపీని గెలిపించారని తెలిపారు. ‘వై నాట్ కుప్పం’ అన్న వారికి పులివెందులలో జెండా ఎగరేసి సమాధానం చెప్పామని గుర్తుచేశారు.
బీసీ యువకుడు చనిపోతే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని చంద్రబాబు ఆరోపించారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనం ఇవ్వలేని సంక్షేమం ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అమరావ తి నిర్మాణం పూర్తయితే మీ ఆదాయం పెరిగేదని చంద్రబాబు వెల్లడించారు. తెలివిలేనివాళ్లు అధికారం లోకి వస్తే దోపిడీ తప్ప మరేమీ ఉండదని చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా మేడికొండూరులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్కు దీటుగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానని అన్నారు. కానీ ప్రజలు జగన్ మాట లు విని మోసపోయారని పేర్కొన్నారు. చివరికి రాజధాని ఉన్న తాడికొండలోనూ వైసీపీని గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నా రు. రాజధాని రైతులు చేస్తోంది ధర్మపోరాటమన్న చంద్రబాబు.. జగన్ ఆడుతున్న మూడుముక్కలాట సాగదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు కూలి పనుల కోసం వచ్చిన వారిని కలిశాననీ.. వారి బాధలు నన్ను కలచివేసాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ తాను అధికారంలోకి రాగానే ఆదుకుం టానని చెప్పారు. మరొక్క ఏడాది భరించాలని పిలుపునిచ్చారు. కాగా, చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
This post was last modified on April 29, 2023 6:21 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…