రాష్ట్రాన్ని కాపాడటానికి 5 కోట్ల మంది ఒకటి కావాలనని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి పట్టుకుని జగన్ను దించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రలోబాలు కాదని, ప్రజలు టీడీపీని గెలిపించారని తెలిపారు. ‘వై నాట్ కుప్పం’ అన్న వారికి పులివెందులలో జెండా ఎగరేసి సమాధానం చెప్పామని గుర్తుచేశారు.
బీసీ యువకుడు చనిపోతే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని చంద్రబాబు ఆరోపించారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనం ఇవ్వలేని సంక్షేమం ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అమరావ తి నిర్మాణం పూర్తయితే మీ ఆదాయం పెరిగేదని చంద్రబాబు వెల్లడించారు. తెలివిలేనివాళ్లు అధికారం లోకి వస్తే దోపిడీ తప్ప మరేమీ ఉండదని చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా మేడికొండూరులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్కు దీటుగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానని అన్నారు. కానీ ప్రజలు జగన్ మాట లు విని మోసపోయారని పేర్కొన్నారు. చివరికి రాజధాని ఉన్న తాడికొండలోనూ వైసీపీని గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నా రు. రాజధాని రైతులు చేస్తోంది ధర్మపోరాటమన్న చంద్రబాబు.. జగన్ ఆడుతున్న మూడుముక్కలాట సాగదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు కూలి పనుల కోసం వచ్చిన వారిని కలిశాననీ.. వారి బాధలు నన్ను కలచివేసాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ తాను అధికారంలోకి రాగానే ఆదుకుం టానని చెప్పారు. మరొక్క ఏడాది భరించాలని పిలుపునిచ్చారు. కాగా, చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
This post was last modified on April 29, 2023 6:21 am
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…