ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతులను ఎన్నికలకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారంటూ పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఆళ్లపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని తరలింపుపై తమ ఆవేదన చెప్పుకునేందుకు ఆర్కే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రైతులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం చేసినందుకు ఆళ్లపై చీటింగ్ కేసు పెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ఆళ్ల చేసిన ప్రకటనను తమ ఫిర్యాదుకు రైతులు జత చేశారు. అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు ముందు చెప్పిన ఆళ్ల…ఇపుడు విశాఖకు రాజధాని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని విషయంలో అపుడో మాట..ఇపుడో మాట…చెప్పినందుకు ఆళ్లపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఫిర్యాదుపై మంగళగిరి టౌన్, రూరల్ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 4, 2020 7:13 pm
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…