దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు విచారణ.. సుదీర్ఘ వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణను ఏకంగా..జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసును ఏప్రిల్ 30(ఈ నెల)న పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. ఎంపీ అవినాష్ను అరెస్టు చేస్తారంటూ.. వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని విచారణను జూలై 31 వ తేదీ నాటికి పూర్తి చేయాలని.. సీబీఐకి గడువు పొడిగించింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న వివేకా స్నేహితుడు, ఆయనకు కుడిభుజం వంటి వ్యక్తి.. ఎర్ర గంగి రెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు.
వీరిని విచారించిన కోర్టు.. అనంతరం జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. తాజాగా మరో ఆదేశం కూడా వెలువడింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు.. అంటే జూలై 31వ తేదీ వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని తెలిపింది.
ఆ తర్వాత కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. అయితే.. ఆయనను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు.. చంచల్గూడ జైలుకు తరలించారు. విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
This post was last modified on April 28, 2023 3:10 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…