దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు విచారణ.. సుదీర్ఘ వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణను ఏకంగా..జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసును ఏప్రిల్ 30(ఈ నెల)న పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. ఎంపీ అవినాష్ను అరెస్టు చేస్తారంటూ.. వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని విచారణను జూలై 31 వ తేదీ నాటికి పూర్తి చేయాలని.. సీబీఐకి గడువు పొడిగించింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న వివేకా స్నేహితుడు, ఆయనకు కుడిభుజం వంటి వ్యక్తి.. ఎర్ర గంగి రెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు.
వీరిని విచారించిన కోర్టు.. అనంతరం జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. తాజాగా మరో ఆదేశం కూడా వెలువడింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు.. అంటే జూలై 31వ తేదీ వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని తెలిపింది.
ఆ తర్వాత కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. అయితే.. ఆయనను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు.. చంచల్గూడ జైలుకు తరలించారు. విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…