Political News

42 చోట్ల కొత్తవారికి ఛాన్స్ ?

తాజాగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అలాంటి ఎంఎల్ఏల పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాకపోయినా వాళ్ళెవరో అందరికీ తెలుసన్నారు. దళితులు, బీసీల అభివృద్ధకి అమలుచేస్తున్న పథకాల్లో కూడా అవినీతికి పాల్పడతారా ? అంటు ఫుల్లుగా క్లాసుపీకారు. అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలంతా రాబంధుల్లాగ పీక్కుతున్నట్లని మండిపడ్డారు.

అవినీతికి పాల్పడ్డవారు తమ పద్దతిని మార్చుకోకపోతే తోకలు కత్తిరించేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, గొర్రెల పంపిణీతో పాటు అనేక కార్యక్రమాల్లో ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడ్డారని కేసీయార్ వివరించారు. ఏ ఎంఎల్ఏ ఎంత అవినీతికి పాల్పడ్డారనే లిస్టు తన దగ్గర ఉందని గట్టిగా చెప్పారు. కేసీయార్ తాజా వార్నింగ్ చూసిన తర్వాత అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలకు టికెట్లు దక్కేది అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది.

ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావటానికి కేసీయార్ పెట్టుకున్న ఆశలు ప్రధానంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలే. కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమల్లోనే ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడటం విచిత్రమనే చెప్పాలి. నిజానికి కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలేవీ అంత గొప్పగా అమలు కావటంలేదు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకాలపై అనేక ఆరోపణలున్నాయి.

సో తాజా డెవలప్మెంట్ నే చూసిన తర్వాత కేసీయార్ వార్నింగ్ ఇచ్చిన 46 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే అవినీతిపరులుగా ఇంత ముద్రపడిన వాళ్ళకే మళ్ళీ టికెట్లిస్తే జనాలు ఓట్లేస్తారా ? అనేది అనుమానం. పైగా పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళపై బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై కేసీయార్ రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నారు. కాబట్టి 42 నియోజకవర్గాల్లో కాకపోయినా మెజారిటి స్ధానాల్లో కొత్త అభ్యర్దులను రంగంలోకి దింపే అవకాశముంది. ఆ విషయం ఇప్పుడే ప్రకటిస్తే గొడవైపోతుందని ప్రకటించుండరంతే.

This post was last modified on April 28, 2023 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago