తాజాగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అలాంటి ఎంఎల్ఏల పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాకపోయినా వాళ్ళెవరో అందరికీ తెలుసన్నారు. దళితులు, బీసీల అభివృద్ధకి అమలుచేస్తున్న పథకాల్లో కూడా అవినీతికి పాల్పడతారా ? అంటు ఫుల్లుగా క్లాసుపీకారు. అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలంతా రాబంధుల్లాగ పీక్కుతున్నట్లని మండిపడ్డారు.
అవినీతికి పాల్పడ్డవారు తమ పద్దతిని మార్చుకోకపోతే తోకలు కత్తిరించేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, గొర్రెల పంపిణీతో పాటు అనేక కార్యక్రమాల్లో ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడ్డారని కేసీయార్ వివరించారు. ఏ ఎంఎల్ఏ ఎంత అవినీతికి పాల్పడ్డారనే లిస్టు తన దగ్గర ఉందని గట్టిగా చెప్పారు. కేసీయార్ తాజా వార్నింగ్ చూసిన తర్వాత అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలకు టికెట్లు దక్కేది అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది.
ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావటానికి కేసీయార్ పెట్టుకున్న ఆశలు ప్రధానంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలే. కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమల్లోనే ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడటం విచిత్రమనే చెప్పాలి. నిజానికి కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలేవీ అంత గొప్పగా అమలు కావటంలేదు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకాలపై అనేక ఆరోపణలున్నాయి.
సో తాజా డెవలప్మెంట్ నే చూసిన తర్వాత కేసీయార్ వార్నింగ్ ఇచ్చిన 46 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే అవినీతిపరులుగా ఇంత ముద్రపడిన వాళ్ళకే మళ్ళీ టికెట్లిస్తే జనాలు ఓట్లేస్తారా ? అనేది అనుమానం. పైగా పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళపై బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై కేసీయార్ రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నారు. కాబట్టి 42 నియోజకవర్గాల్లో కాకపోయినా మెజారిటి స్ధానాల్లో కొత్త అభ్యర్దులను రంగంలోకి దింపే అవకాశముంది. ఆ విషయం ఇప్పుడే ప్రకటిస్తే గొడవైపోతుందని ప్రకటించుండరంతే.
This post was last modified on April 28, 2023 12:39 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…