ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభలో పాల్గొనేందుకు ఆయన రాగా, ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ రోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ సభలో రజినీకాంత్ పాల్గొంటున్నారు.
కాగా నందమూరి తారకరామారావు శత వసంతాలను పురస్కరించుకుని శతజయంతి ఉత్సవాల శంఖారావాన్ని నేడు విజయవాడ వేదికగా పూరించనున్నారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నెలరోజుల పాటు 100 ప్రాంతాల్లో వందో పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు.
విజయవాడ వేదికగా నిర్వహించే శత జయంతి ఉత్సవాల అంకురార్పణకు సూపర్ స్టార్ రజినీకాంత్ విశిష్ట అతిథిగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఆ క్రమంలోనే రజినీకాంత్ ఇప్పటికే గన్నవరం చేరుకున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు.
కాగా.. ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇప్పటికే మొదలవడంతో రాజకీయ వేడి కూడా తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజినీకాంత్ రావడమనేది ఏపీలోని ఎన్టీఆర్ అభిమానులతో పాటు రజినీకాంత్ అభిమానులనూ సంతోషపెడుతోంది.
This post was last modified on April 28, 2023 12:35 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమికి ఓ ప్రధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్నే…
మీడియా ముందే నాయకులు వలవలా ఏడ్చేయడం కొత్త కాదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. తన సతీమణిని దూషించారంటూ..…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జరిగే పోలింగ్తో పార్టీల రాజకీయ జీవితాలు ముడిపడి ఉన్నాయి. అధికారం…
ఏపీలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 లక్షల…
ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్కు…