వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ ఘోష పెడుతున్నారు. తమ మాటకు విలువ లేకుండా పోయిందని తల్లడిల్లుతు న్నారు. తాము ఇలా అయిపోవడానికి ఆయనే కారణం అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. పైకి పేరు చెప్పేందుకు కొందరు సాహసం చేయకపోయినా.. తమను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక సలహాదారుపై వారు విరుచుకుపడుతున్నారు. “మేమేదో.. మాకు తెలుసు. మధ్యలో ఆయన పెత్తనం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల వద్దే కుండబద్దలు కొడుతున్నారు.
వైసీపీలో ఒకప్పుడు పార్టీ అధినేత జగన్కు.. నాయకులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేరుగా ఆయనతో మాట్లాడుకునేందుకు కూడా అనుమతి ఉండేది. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అన్ని పద్ధతులు మారిపోయాయి. సీఎం జగన్ను ఒక ప్రతిష్టాత్మక నాయకుడిగా తీర్చిదిద్దాలనే క్రమంలో ఆయనకు నేతలకు మధ్య గ్యాప్ పెంచారనే వాదన బలంగా ఉంది. ఇదే.. ఇప్పుడు పార్టీని నిలువునా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.
అందుకే.. నేతల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంపై మాట్లాడాలన్నా.. ముందు గా సీఎంవో అనుమతి.. తర్వాత.. సలహాదారు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి పెరిగిపోయిందని అంటున్నారు. దీనిని మెజారిటీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధానంగా గత ఏడాది జరిగిన మం త్రి వర్గ విస్తరణలో సదరు సలహాదారు.. అన్నీతానై వ్యవహరించడం వల్లే.. తమకు రావాల్సిన పదవులు రాకుండా .. పోయాయనే వాదనను చాలా మంది నాయకులు చెబుతున్నారు.
గుంటూరు కు చెందిన వ్యక్తికి మంత్రి పదవి దక్కడంపైనా.. నాయకుల్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన వారికి కూడా మంత్రి పదువులు ఇవ్వడం వెనుక ఆయనే చక్రం తిప్పారనే వాదన కూడా వినిపించింది. వెరసి ఇవన్నీ కూడా నేతలను పార్టీకి దూరం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఒక సలహాదారు కారణంగా.. పార్టీ మరింత పుంజుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి రివర్స్లో జరుగుతుండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు మరో పది మాసాలే గడువు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలనేది మెజారిటీ నేతలు కోరుతున్న మాట. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 29, 2023 4:31 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…