వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ ఘోష పెడుతున్నారు. తమ మాటకు విలువ లేకుండా పోయిందని తల్లడిల్లుతు న్నారు. తాము ఇలా అయిపోవడానికి ఆయనే కారణం అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. పైకి పేరు చెప్పేందుకు కొందరు సాహసం చేయకపోయినా.. తమను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక సలహాదారుపై వారు విరుచుకుపడుతున్నారు. “మేమేదో.. మాకు తెలుసు. మధ్యలో ఆయన పెత్తనం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల వద్దే కుండబద్దలు కొడుతున్నారు.
వైసీపీలో ఒకప్పుడు పార్టీ అధినేత జగన్కు.. నాయకులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేరుగా ఆయనతో మాట్లాడుకునేందుకు కూడా అనుమతి ఉండేది. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అన్ని పద్ధతులు మారిపోయాయి. సీఎం జగన్ను ఒక ప్రతిష్టాత్మక నాయకుడిగా తీర్చిదిద్దాలనే క్రమంలో ఆయనకు నేతలకు మధ్య గ్యాప్ పెంచారనే వాదన బలంగా ఉంది. ఇదే.. ఇప్పుడు పార్టీని నిలువునా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.
అందుకే.. నేతల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంపై మాట్లాడాలన్నా.. ముందు గా సీఎంవో అనుమతి.. తర్వాత.. సలహాదారు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి పెరిగిపోయిందని అంటున్నారు. దీనిని మెజారిటీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధానంగా గత ఏడాది జరిగిన మం త్రి వర్గ విస్తరణలో సదరు సలహాదారు.. అన్నీతానై వ్యవహరించడం వల్లే.. తమకు రావాల్సిన పదవులు రాకుండా .. పోయాయనే వాదనను చాలా మంది నాయకులు చెబుతున్నారు.
గుంటూరు కు చెందిన వ్యక్తికి మంత్రి పదవి దక్కడంపైనా.. నాయకుల్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన వారికి కూడా మంత్రి పదువులు ఇవ్వడం వెనుక ఆయనే చక్రం తిప్పారనే వాదన కూడా వినిపించింది. వెరసి ఇవన్నీ కూడా నేతలను పార్టీకి దూరం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఒక సలహాదారు కారణంగా.. పార్టీ మరింత పుంజుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి రివర్స్లో జరుగుతుండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు మరో పది మాసాలే గడువు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలనేది మెజారిటీ నేతలు కోరుతున్న మాట. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 29, 2023 4:31 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…