సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి బాట పట్టారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం సరైన చర్యకాదన్నారు. ముఖ్యంగా దళితులకు ఉద్దేశించిన కీలకమైన పథకం.. దళిత బంధును ఆసరా చేసుకుని సొమ్ములు బొక్కేయడం సరికాదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వాళ్లెవరో కూడా తన దగ్గర చిట్టా ఉందని చెప్పుకొచ్చారు.
ఇదే చివరి వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే టికెట్ దక్కదని కేసీఆర్ హెచ్చరించారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని తేల్చి చెప్పారు.
షెడ్యూల్ ప్రకారమే!
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. ఆసాంతం ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి పెట్టారు.
అదేజాతీయ నినాదం..!
‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు జాతీయ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని..సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తయ్. అనేక లొల్లిలు తెరమీద కనబడతై.. అయినా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగాల! అని దిశానిర్దేశం చేశారు.
This post was last modified on April 27, 2023 9:48 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…