రెండు రోజుల కిందట తిరుమల ఆనంద నిలయంపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు హెలికాప్టర్లు ఆనంద నిలయం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఆనంద నిలయం మీదుగా వెళ్లరాదని ఎప్పటి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసింది. అయినా కూడా తరచుగా ఆనంద నిలయం మీదుగా విమానాలు.. హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి.
ఇక, తాజా విషయంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటా మని.. ఆర్మీ అధికారులకు చెందిన వాహనాలుగా గుర్తించామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో కలకలం రేపాయి. శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలికగా రియాక్ట్ అయ్యారు. ఇంత జరిగి.. దేశవ్యాప్తం గా భక్తులు ఆవేదన చెందుతున్న విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు.
“ఔను. నేను కూడా బాధపడ్డా. ఏం చేస్తాం. తిరుమలపై హెలికాప్టర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవని తెలిసిందన్నారు. దీనిపై అధికా రులకు టీటీడీ ఫోన్ చేసి వివరణ కోరే పరిస్థితి లేదన్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్తత వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని.. అయితే.. అప్పట్లో మాత్రం ఇంత వివాదం కాలేదని.. ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు.
This post was last modified on April 27, 2023 2:57 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…