రెండు రోజుల కిందట తిరుమల ఆనంద నిలయంపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు హెలికాప్టర్లు ఆనంద నిలయం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఆనంద నిలయం మీదుగా వెళ్లరాదని ఎప్పటి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసింది. అయినా కూడా తరచుగా ఆనంద నిలయం మీదుగా విమానాలు.. హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి.
ఇక, తాజా విషయంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటా మని.. ఆర్మీ అధికారులకు చెందిన వాహనాలుగా గుర్తించామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో కలకలం రేపాయి. శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలికగా రియాక్ట్ అయ్యారు. ఇంత జరిగి.. దేశవ్యాప్తం గా భక్తులు ఆవేదన చెందుతున్న విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు.
“ఔను. నేను కూడా బాధపడ్డా. ఏం చేస్తాం. తిరుమలపై హెలికాప్టర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవని తెలిసిందన్నారు. దీనిపై అధికా రులకు టీటీడీ ఫోన్ చేసి వివరణ కోరే పరిస్థితి లేదన్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్తత వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని.. అయితే.. అప్పట్లో మాత్రం ఇంత వివాదం కాలేదని.. ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు.
This post was last modified on April 27, 2023 2:57 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…