రెండు రోజుల కిందట తిరుమల ఆనంద నిలయంపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు హెలికాప్టర్లు ఆనంద నిలయం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఆనంద నిలయం మీదుగా వెళ్లరాదని ఎప్పటి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసింది. అయినా కూడా తరచుగా ఆనంద నిలయం మీదుగా విమానాలు.. హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి.
ఇక, తాజా విషయంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటా మని.. ఆర్మీ అధికారులకు చెందిన వాహనాలుగా గుర్తించామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో కలకలం రేపాయి. శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలికగా రియాక్ట్ అయ్యారు. ఇంత జరిగి.. దేశవ్యాప్తం గా భక్తులు ఆవేదన చెందుతున్న విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు.
“ఔను. నేను కూడా బాధపడ్డా. ఏం చేస్తాం. తిరుమలపై హెలికాప్టర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవని తెలిసిందన్నారు. దీనిపై అధికా రులకు టీటీడీ ఫోన్ చేసి వివరణ కోరే పరిస్థితి లేదన్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్తత వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని.. అయితే.. అప్పట్లో మాత్రం ఇంత వివాదం కాలేదని.. ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు.
This post was last modified on April 27, 2023 2:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…