Political News

ఏం చేస్తాం.. తిరుమ‌ల‌పై హెలికాప్ట‌ర్లు తిరిగాయి: వైవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెండు రోజుల కింద‌ట తిరుమ‌ల ఆనంద నిల‌యంపై హెలికాప్ట‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మూడు హెలికాప్ట‌ర్లు ఆనంద నిల‌యం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఇలా ఆనంద నిల‌యం మీదుగా వెళ్ల‌రాద‌ని ఎప్ప‌టి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. కేంద్రానికి అనేక సంద‌ర్భాల్లో లేఖ‌లు రాసింది. అయినా కూడా త‌ర‌చుగా ఆనంద నిల‌యం మీదుగా విమానాలు.. హెలికాప్ట‌ర్లు ప్ర‌యాణిస్తున్నాయి.

ఇక‌, తాజా విష‌యంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని.. ఆర్మీ అధికారుల‌కు చెందిన వాహ‌నాలుగా గుర్తించామ‌న్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో క‌ల‌కలం రేపాయి. శ్రీవారి భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలిక‌గా రియాక్ట్ అయ్యారు. ఇంత జ‌రిగి.. దేశ‌వ్యాప్తం గా భ‌క్తులు ఆవేద‌న చెందుతున్న విష‌యాన్ని ఆయ‌న లైట్ తీసుకున్నారు.

“ఔను. నేను కూడా బాధ‌ప‌డ్డా. ఏం చేస్తాం. తిరుమ‌లపై హెలికాప్ట‌ర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవ‌ని తెలిసిందన్నారు. దీనిపై అధికా రుల‌కు టీటీడీ ఫోన్ చేసి వివ‌ర‌ణ కోరే ప‌రిస్థితి లేద‌న్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్త‌త వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయ‌ని.. అయితే.. అప్ప‌ట్లో మాత్రం ఇంత వివాదం కాలేద‌ని.. ఇప్పుడు మాత్రం ప్ర‌తి విష‌యాన్నీ బూత‌ద్దంలో చూస్తున్నార‌ని విమ‌ర్శించారు.

This post was last modified on April 27, 2023 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago