రెండు రోజుల కిందట తిరుమల ఆనంద నిలయంపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు హెలికాప్టర్లు ఆనంద నిలయం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఆనంద నిలయం మీదుగా వెళ్లరాదని ఎప్పటి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసింది. అయినా కూడా తరచుగా ఆనంద నిలయం మీదుగా విమానాలు.. హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి.
ఇక, తాజా విషయంపై ఆ రోజు స్పందించిన టీటీడీ అధికారులు.. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటా మని.. ఆర్మీ అధికారులకు చెందిన వాహనాలుగా గుర్తించామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో కలకలం రేపాయి. శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. చాలా తేలికగా రియాక్ట్ అయ్యారు. ఇంత జరిగి.. దేశవ్యాప్తం గా భక్తులు ఆవేదన చెందుతున్న విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు.
“ఔను. నేను కూడా బాధపడ్డా. ఏం చేస్తాం. తిరుమలపై హెలికాప్టర్లు తిరిగాయి” అని వైవీ తాజాగా స్పం దించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీవని తెలిసిందన్నారు. దీనిపై అధికా రులకు టీటీడీ ఫోన్ చేసి వివరణ కోరే పరిస్థితి లేదన్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకో లేమని చెప్పారు. అంతా శ్రీవారే చూసుకుంటారు. అని నిర్లిప్తత వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని.. అయితే.. అప్పట్లో మాత్రం ఇంత వివాదం కాలేదని.. ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు.
This post was last modified on April 27, 2023 2:57 pm
బాక్సాఫీస్ వద్ద థ్రిల్లర్ సినిమాలను మించిన ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఉదయాన్నే టాక్సిక్ ఇచ్చిన షాక్ నుంచి మూవీ లవర్స్ ఇంకా…
టాలీవుడ్లో మహిళా దర్శకులు తక్కువ. ఉన్నంతలో మనమే బెటర్ కానీ ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. నటి వరలక్ష్మి…
తలచినదే జరిగినదా దైవం ఎందులకు అంటూ పాత పాట ఒకటుంది. ప్యాన్ ఇండియా సినిమాల రిలీజు వ్యవహారంలో ఇది అచ్చంగా…
హరీష్ శంక్.. ఈ పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఛాతీలు విచ్చుకుంటాయి. ఎక్కడలేని ఉద్వేగం తన్నుకొస్తుంది.…
నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలు చేయడం చాలా అరుదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ క్యామియోలు చేశారు కానీ బాలయ్య మాత్రం…
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల…