కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేసేందుకు.. ముందుకు వస్తానని.. గతంలోనే ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకున్నా.. ఇప్పటి వరకు మౌనంగా నే ఉన్నారు. పైగా ఆయన దృష్టంగా మహారాష్ట్రపై ఉంది. ఇదే కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. కర్ణాటకకు చెందిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ చీఫ్ కుమారస్వామి.. కేసీఆర్ అనుంగు మిత్రుడుగా మారారు.
కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వచ్చి.. బీఆర్ఎస్ రాజకీయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి పార్టీకి ప్రచారం చేస్తానన్న కేసీఆర్.. ప్రచారం ప్రారంభించి పది రోజులు అయినా.. ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అయితే.. దీనికి కారణం.. జేడీఎస్ నుంచి మరోసారి ఆహ్వానం అందలేదని.. ప్రగతి భవన్ వర్గాలు చెప్పాయి. అయితే.. అనుకున్నట్టుగానే కుమారస్వామి నుంచి తాజాగా కేసీఆర్కు ఫోన్ వచ్చింది.
రండి సర్.. మమ్మల్ని గెలిపించండి! అని కుమార స్వామి ఫోన్ చేసి కేసీఆర్ను ఆహ్వానించారని సమచారం.ఈ విషయాన్ని కేసీఆర్.. పార్టీలో చర్చించారు. దీంతో గురు లేదా, శుక్రవారాల్లో కేసీఆర్ తన బృందాన్ని పంపించాలని నిర్ణయించుకున్నారు. వీరిలో సరిహద్దు జిల్లాల నాయకులు.. ముఖ్యంగా చోటు కల్పిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. తాను కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నా.. మే 5- 8 మధ్య రెండు రోజులు సుడిగాలి పర్యటనలు చేసేందుకు నిర్ణయించుకున్నట్టు సమచారం.
బీజేపీని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ఇవే విషయాలపై అక్కడ కూడా ప్రచారం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక్కడ జేడీఎస్ కన్నా.. కేసీఆర్.. మోడీని మైనస్ చేసేందుకు.. ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. దీనిపై కసరత్తు ముమ్మరం చేస్తారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…