Political News

భార‌త్ జ‌నాభా: జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద కార్టూన్‌.. కేంద్రం సీరియ‌స్‌

భార‌త్‌లో జ‌నాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 ల‌క్ష‌ల మందికి పైగా చైనా కంటే భార‌త్‌లో జ‌నాభా పెరిగార‌ని.. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి. అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపైనా మేధో మ‌థ‌నం చేస్తోంది.

అయితే.. ఇంత‌లోనే.. తాజాగా భార‌త్ కు మిత్ర దేశం జ‌ర్మ‌నీ.. ఈ జ‌నాభాను ఎద్దేవా చేస్తూ.. వ్యంగ్య చిత్రాలు వెలుగులోకి రావ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం కూడా వెంట‌నే రియాక్ట్ అయింది. జ‌ర్మ‌నీ దౌత్య‌కార్యాలయానికి త‌మ నిర‌స‌న తెలిపింది. జర్మనీ మ్యాగజైన్ ‘డెర్‌ స్పీజెల్‌’ ఈ కార్టూన్‌ను ప్రచురించింది.

కార్టూన్ సారాంశం ఇదే..
చైనాకు చెందిన ఆధునిక బులెట్‌ రైలును, భారత్‌కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ ప్ర‌పంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్‌కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జాత్యహంకారంతోనే కార్టూన్‌ను గీశారని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ మండిపడ్డారు. “డెర్‌ స్పీజెల్ లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది” అని ఆయన పేర్కొన్నారు.

వాస్తవికతకు కార్టూన్‌ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ శాఖ సీనియర్‌ సలహాదారు కాంచన్‌ గుప్తా తేల్చిచెప్పారు. “హాయ్‌ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్‌ స్పీజెల్‌ కార్టూన్‌ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్‌ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు” అని ట్వీట్‌ చేశారు. డెర్‌ స్పీజెల్‌ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్‌ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పాండా సూచించారు.

సాయిరెడ్డి స్పంద‌న‌
ఈ కార్టూన్‌పై వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. భారత్‌ను పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ఎప్పుడూ యత్నిస్తుంటాయని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

This post was last modified on April 26, 2023 3:23 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

16 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

27 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago