Political News

భార‌త్ జ‌నాభా: జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద కార్టూన్‌.. కేంద్రం సీరియ‌స్‌

భార‌త్‌లో జ‌నాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 ల‌క్ష‌ల మందికి పైగా చైనా కంటే భార‌త్‌లో జ‌నాభా పెరిగార‌ని.. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి. అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపైనా మేధో మ‌థ‌నం చేస్తోంది.

అయితే.. ఇంత‌లోనే.. తాజాగా భార‌త్ కు మిత్ర దేశం జ‌ర్మ‌నీ.. ఈ జ‌నాభాను ఎద్దేవా చేస్తూ.. వ్యంగ్య చిత్రాలు వెలుగులోకి రావ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం కూడా వెంట‌నే రియాక్ట్ అయింది. జ‌ర్మ‌నీ దౌత్య‌కార్యాలయానికి త‌మ నిర‌స‌న తెలిపింది. జర్మనీ మ్యాగజైన్ ‘డెర్‌ స్పీజెల్‌’ ఈ కార్టూన్‌ను ప్రచురించింది.

కార్టూన్ సారాంశం ఇదే..
చైనాకు చెందిన ఆధునిక బులెట్‌ రైలును, భారత్‌కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ ప్ర‌పంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్‌కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జాత్యహంకారంతోనే కార్టూన్‌ను గీశారని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ మండిపడ్డారు. “డెర్‌ స్పీజెల్ లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది” అని ఆయన పేర్కొన్నారు.

వాస్తవికతకు కార్టూన్‌ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ శాఖ సీనియర్‌ సలహాదారు కాంచన్‌ గుప్తా తేల్చిచెప్పారు. “హాయ్‌ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్‌ స్పీజెల్‌ కార్టూన్‌ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్‌ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు” అని ట్వీట్‌ చేశారు. డెర్‌ స్పీజెల్‌ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్‌ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పాండా సూచించారు.

సాయిరెడ్డి స్పంద‌న‌
ఈ కార్టూన్‌పై వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. భారత్‌ను పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ఎప్పుడూ యత్నిస్తుంటాయని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago