భారత్లో జనాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 లక్షల మందికి పైగా చైనా కంటే భారత్లో జనాభా పెరిగారని.. ఇటీవలే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. అయితే.. జనాభా నియంత్రణకు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా తగ్గించాలనే విషయంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మేధో మథనం చేస్తోంది.
అయితే.. ఇంతలోనే.. తాజాగా భారత్ కు మిత్ర దేశం జర్మనీ.. ఈ జనాభాను ఎద్దేవా చేస్తూ.. వ్యంగ్య చిత్రాలు వెలుగులోకి రావడం.. సంచలనంగా మారింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. జర్మనీ దౌత్యకార్యాలయానికి తమ నిరసన తెలిపింది. జర్మనీ మ్యాగజైన్ ‘డెర్ స్పీజెల్’ ఈ కార్టూన్ను ప్రచురించింది.
కార్టూన్ సారాంశం ఇదే..
చైనాకు చెందిన ఆధునిక బులెట్ రైలును, భారత్కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాత్యహంకారంతోనే కార్టూన్ను గీశారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. “డెర్ స్పీజెల్ లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది” అని ఆయన పేర్కొన్నారు.
వాస్తవికతకు కార్టూన్ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా తేల్చిచెప్పారు. “హాయ్ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్ స్పీజెల్ కార్టూన్ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు” అని ట్వీట్ చేశారు. డెర్ స్పీజెల్ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా సూచించారు.
సాయిరెడ్డి స్పందన
ఈ కార్టూన్పై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందించారు. భారత్ను పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ఎప్పుడూ యత్నిస్తుంటాయని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
This post was last modified on April 26, 2023 3:23 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…