భారత్లో జనాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 లక్షల మందికి పైగా చైనా కంటే భారత్లో జనాభా పెరిగారని.. ఇటీవలే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. అయితే.. జనాభా నియంత్రణకు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా తగ్గించాలనే విషయంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మేధో మథనం చేస్తోంది.
అయితే.. ఇంతలోనే.. తాజాగా భారత్ కు మిత్ర దేశం జర్మనీ.. ఈ జనాభాను ఎద్దేవా చేస్తూ.. వ్యంగ్య చిత్రాలు వెలుగులోకి రావడం.. సంచలనంగా మారింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. జర్మనీ దౌత్యకార్యాలయానికి తమ నిరసన తెలిపింది. జర్మనీ మ్యాగజైన్ ‘డెర్ స్పీజెల్’ ఈ కార్టూన్ను ప్రచురించింది.
కార్టూన్ సారాంశం ఇదే..
చైనాకు చెందిన ఆధునిక బులెట్ రైలును, భారత్కు చెందిన ఓ సాధారణ రైలు దాటి వెళ్తున్నట్లుగా చిత్రీకరించింది. భారత రైలు కిక్కిరిసి ఉన్నట్లు, రైలుపై కూడా జనం భారీగా కూర్చున్నట్లుగా అందులో చూపించింది. ఈ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ప్రధానంగా భారత్కు చెందిన రాజకీయ నాయకులు, నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాత్యహంకారంతోనే కార్టూన్ను గీశారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. “డెర్ స్పీజెల్ లోని కార్టూనిస్టుకు ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్పై వ్యతిరేకత వ్యక్తం చేయడం అంత తెలివైన పని కాదు. కేవలం మరికొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీని దాటనుంది” అని ఆయన పేర్కొన్నారు.
వాస్తవికతకు కార్టూన్ చాలా దూరంలో ఉందని కేంద్ర ఐటీ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా తేల్చిచెప్పారు. “హాయ్ జర్మనీ. ఇది పూర్తిగా జాత్యహంకారమే. మీ డెర్ స్పీజెల్ కార్టూన్ వాస్తవికతకు చాలా దూరంలో ఉంది. ఇది కేవలం భారత్ను దిగజార్చి, చైనా ప్రాపకం పొందేందుకే చేశారు” అని ట్వీట్ చేశారు. డెర్ స్పీజెల్ పత్రిక తన పేరును జాత్యహంకార, ట్రోలింగ్ పత్రికగా మార్చుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా సూచించారు.
సాయిరెడ్డి స్పందన
ఈ కార్టూన్పై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందించారు. భారత్ను పేద దేశంగా చూపించేందుకే పశ్చిమ దేశాలు ఎప్పుడూ యత్నిస్తుంటాయని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
This post was last modified on April 26, 2023 3:23 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…