Political News

తన మిత్రుడుకి 22 అంతస్తుల బిల్డింగ్ బహుమతి ఇచ్చిన అంబానీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన చిరాకాల మిత్రుడు మోదీకి ముంబయిలో రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల భవనాన్ని కానుకగా ఇచ్చారు. అయితే, అంబానీ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకుంటున్న ఈ మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కాదు.. మనోజ్ మోదీ. అవును.. 40 ఏళ్లుగా రిలయన్స్‌లో పనిచేస్తున్న మనోజ్ మోదీ.
మనోజ్ మోదీకి దక్షిణ ముంబయిలోని నేపియన్ సీ రోడ్‌లో ఉన్న 22 అంతస్తుల బృందావన్ అపార్టుమెంట్‌ను అంబానీ గిఫ్ట్ ఇచ్చారు.

దాని విలువ రూ. 1500 కోట్లు. ముంబయిలోని అత్యంత కాస్ట్లీ ఏరియాల్లో నేపియన్ సీ రోడ్ కూడా ఒకటి. ఇక్కడున్న బృందావన్ అపార్ట్‌మెంట్లో మొదటి 7 అంతస్తులను కేవలం పార్కింగ్ కోసమే ఉంచారు. మొత్తం ఇందులో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్పేస్ ఉంది. ఒక్కో అంతస్తు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. తలతీ పార్ట్‌నర్స్ కంపెనీ కట్టిన ఈ బిల్డింగ్‌కు ఇటలీ నుంచి చాలా సామగ్రి తీసుకొచ్చారు.

ఇంతకీ మనోజ్ మోదీకి ఇంత భారీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారనే అనుమానం రావొచ్చు. రిలయన్స్ అంటే ముకేశ్ అంబానీ అనే అందరికీ తెలిసినా మనోజ్ మోదీ అనే మాస్టర్ మైండ్ ఒకటి దాని వెనుక ఉందని సాధారణ ప్రజల్లో చాలామందికి తెలియదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మనోజ్ మోడీ రైట్ హ్యాండ్. మనోజ్ మోదీ 1980లో రిలయన్స్‌లో జాయిన్ అయ్యారు. అప్పటికి ధీరూబాయి అంబానీ దానికి చైర్మన్.

ముంబయిలో చదువుకుంటున్నప్పటి నుంచి ముకేశ్, మనోజ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. రిలయన్స్ కుదర్చుకున్న వేల కోట్ల విలువైన ఎన్నో ఒప్పందాల వెనుక ఉన్న బుర్ర మనోజ్ మోదీదేనని చెప్తారు. అంతెందుకు 2020లో ఫేస్ బుక్‌తో జియో 43 వేల కోట్ల ఒప్పందం కుదరడం వెనుక ఉన్నదీ మనోజ్ మోదీయే.

దశాబ్దాల పాటు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో కలిసి పనిచేసిన మనోజ్ మోదీ ఇప్పుడు ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీలకు సపోర్టుగా అంతా చూసుకుంటున్నారు. అయితే.. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మనోజ్ మోదీ ఎక్కడా సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్‌లో కానీ కనిపించరు. తన పని తాను చేసుకుంటుంటారు. అందుకే.. ఇలా.. రిలయన్స్ అభివృద్ధి వెనుక నిత్యంతనతో ఉన్న మిత్రుడికి ముకేశ్ భారీ గిఫ్ట్ ఇచ్చారు.

This post was last modified on April 26, 2023 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

1 hour ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

2 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

2 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

3 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

3 hours ago

టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…

4 hours ago