తాను విజన్ 2020 అంటే.. తనను 420 అంటూ కొన్ని రాజకీయ పార్టీలు గేలి చేశాయని టీడీపీ అధినేత చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను విజన్ 2020 అంటూ.. ఒక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పూనుకొన్నట్టు తెలిపారు. తద్వారా.. రాష్ట్రాన్ని దేశంలోను.. ప్రపంచంలోనూ కూడా అగ్రపథంలో ఉంచేందుకు ప్రయత్నించానని చెప్పారు. ఈ క్రమంలోనే సెల్ ఫోన్లను తీసుకురావడంపై దృష్టి పెట్టానన్నారు. అయితే.. దీనిని ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయని చెప్పారు.
తాజాగా రిపబ్లికన్ టీవీ నిర్వహించిన చర్చావేదిక 2023లో చంద్రబాబు తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విజన్ 2020 గురించి వివరించారు. ఆనాడు ఎంతో పట్టుదలతో తాను విజన్ 2020 సాకారం కోసం కృషి చేసినట్టు వివరించారు. ఇదే ఇప్పుడు హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. కానీ, ఆ నాడు ఎవరో ఏదో అన్నారని .. ఆగిపోయి ఉంటే.. ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ సాకారం అయ్యేవి కావని తెలిపారు. ఇప్పుడు కూడా తనకు 2040 విజన్ ఉందని చెప్పారు.
సమాజం కోసం ముందుచూపుతో పని చేసే నేతలు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తనను ప్రతిపక్షాలు విమర్శించేవన్న ఆయన ఇప్పుడూ అలాగే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. కేవలం సంక్షేమాన్ని అమలు చేస్తూ.. పోతే.. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిపారు. ఆర్థిక వనరులు , ఆదాయ వనరులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జీఎస్టీ రియాల్టీ.. డిజిటల్ కరెన్సీ రియాల్టీ అనేది కీలకమని చంద్రబాబు చెప్పారు. రూ.500కి పైన ఉన్న నోట్లను రద్దు చేస్తే.. అన్ని రకాల అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. తాను అధికారం కోసం లేనని, దేశాభివృద్ధి కోసమే పని చేశానని చెప్పారు. వాజ్ పేయి హయాంలో టీడీపీకి ఆరేడు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామన్నా.. తాము అంగీకరించలేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం తన ముందున్న ప్రధాన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. పేదలు లేని ఏపీని రూపొందించడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు తెలిపారు.
This post was last modified on April 26, 2023 8:04 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…