తెలంగాణ కీలకనాయకుడు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్యా నాయక్ నోరుపారేసుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్ను విమర్శించే వారిపైనా బూతులతో విరుచుకుపడ్డారు. లం.. కొడుకులు, గు.. బలిసి.. అంటూ.. ఆయన ఒళ్లు తెలియని విధంగా బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరిన్ని పరుష పదాలతో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్యా నాయక్ కూడా సిరోల్ మండలంలో తన అనుచరులు, అభిమానులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతరల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. వాడికి గు.. బలిసింది అంటూ.. బూతులు ప్రయోగించారు. దీంతో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారంటూ.. ఒకరికొకరు మొహమొహాలు చూసుకున్నారు. అయినా.. రెడ్యా నాయక్ తన మానాన తాను బూతు పురాణం కొనసాగించారు.
ఇదిలావుంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్. గతంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.
This post was last modified on April 26, 2023 7:42 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…