Political News

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం

తెలంగాణ కీల‌క‌నాయ‌కుడు, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రెడ్యా నాయ‌క్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను విమ‌ర్శించే వారిపైనా బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. లం.. కొడుకులు, గు.. బ‌లిసి.. అంటూ.. ఆయ‌న ఒళ్లు తెలియ‌ని విధంగా బ‌హిరంగ వేదిక‌పై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మ‌రిన్ని ప‌రుష ప‌దాల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా మంట‌లు రేపుతున్నాయి.

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రెడ్యా నాయ‌క్ కూడా సిరోల్ మండ‌లంలో త‌న అనుచ‌రులు, అభిమానుల‌తో స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌క్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్‌కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతరల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. వాడికి గు.. బ‌లిసింది అంటూ.. బూతులు ప్ర‌యోగించారు. దీంతో స‌భ‌కు వ‌చ్చిన వారు ఒక్క‌సారిగా నిశ్చేష్టుల‌య్యారు. అస‌లు ఆయ‌న ఏం మాట్లాడుతున్నారంటూ.. ఒక‌రికొక‌రు మొహ‌మొహాలు చూసుకున్నారు. అయినా.. రెడ్యా నాయ‌క్ త‌న మానాన తాను బూతు పురాణం కొన‌సాగించారు.

ఇదిలావుంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్. గ‌తంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయ‌కుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావ‌టంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.

This post was last modified on April 26, 2023 7:42 am

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

6 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago