తెలంగాణ కీలకనాయకుడు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్యా నాయక్ నోరుపారేసుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్ను విమర్శించే వారిపైనా బూతులతో విరుచుకుపడ్డారు. లం.. కొడుకులు, గు.. బలిసి.. అంటూ.. ఆయన ఒళ్లు తెలియని విధంగా బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరిన్ని పరుష పదాలతో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్యా నాయక్ కూడా సిరోల్ మండలంలో తన అనుచరులు, అభిమానులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతరల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. వాడికి గు.. బలిసింది అంటూ.. బూతులు ప్రయోగించారు. దీంతో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారంటూ.. ఒకరికొకరు మొహమొహాలు చూసుకున్నారు. అయినా.. రెడ్యా నాయక్ తన మానాన తాను బూతు పురాణం కొనసాగించారు.
ఇదిలావుంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్. గతంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడి నోటి వెంట ఇలాంటి మాటలు రావటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…