పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో సోమవారం రాత్రంగా గడిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనలు..తీవ్ర ఉత్కంఠ అనంతరం.. సంచలన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. తొలుత మంగళవారం ఉదయం కోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి.
ఈ పిటిషన్పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లన్నీ(350, 353) ఆరు నెలలు, మూడు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేవే అని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు నిబంధనలను కూడా పోలీసులు పాటించడం లేదని చెప్పారు.
షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకంటే ముందు చోటు చేసుకున్న ఘటనలు.. వాటికి సంబంధించిన వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక, పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.
షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. సమాజంలో అశాంతిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తీర్పును తొలుత వాయిదా వేసింది. అనంతరం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ.. షరతులు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…