పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో సోమవారం రాత్రంగా గడిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనలు..తీవ్ర ఉత్కంఠ అనంతరం.. సంచలన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. తొలుత మంగళవారం ఉదయం కోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి.
ఈ పిటిషన్పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లన్నీ(350, 353) ఆరు నెలలు, మూడు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేవే అని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు నిబంధనలను కూడా పోలీసులు పాటించడం లేదని చెప్పారు.
షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకంటే ముందు చోటు చేసుకున్న ఘటనలు.. వాటికి సంబంధించిన వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక, పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.
షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. సమాజంలో అశాంతిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తీర్పును తొలుత వాయిదా వేసింది. అనంతరం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ.. షరతులు
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…