Political News

అమరావతికి ‘సీమ’ మద్దతు.. విశాఖకు నో


ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటంపై అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు అంతగా ఇష్టపడని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియ చేపట్టటం.. త్వరలోనే ఆ పని మొదలవుతుందన్ స్పష్టమైన సందేశాన్ని ఈ మధ్యనే వెల్లడించటం తెలిసిందే. అయితే.. విశాఖకు రాజధానిని తరలించటంపై సీమ వాసుల వాదన ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన ఒకటి రాయలసీమ కర్తవ్య దీక్ష కార్యక్రమం స్పష్టం చేసింది.

ఈ సభకు రాయలసీమకు చెందిన పలువురు ముఖ్యనేతలు వచ్చారు. వారంతా రాయలసీమ వెనుకుబాటుతనాన్ని ప్రస్తావించటంతో పాటు.. సీమలోని నాలుగు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమను ఒకరాష్ట్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఈ వాదనకు సంపూర్ణ మద్దతు లభించలేదు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు.. అనంతపురం జిల్లాల్ని తెలంగాణలో కలిపేసి రాయల తెలంగాణగా మార్చాలని.. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తో తాను మాట్లాడినట్లు చెప్పి సంచలనంగా మారారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచాలని.. విశాఖ వద్దన్న వాదన పెద్ద ఎత్తున వినిపించటం కీలకంగా మారింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి మారిస్తే దూరాభారం అవుతుందని.. దీని కారణంగా సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సీమకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్న నేతలు.. రాజధానిగా అమరావతికే తమ ఓటు వేయటం గమనార్హం. ఇంతకాలం రాజధానిగా అమరావతా? విశాఖనా? అన్న విషయంపై సీమ నేతల అభిప్రాయం ఏమిటన్న దానిపై క్లారిటీ లేకపోగా.. తాజా సభ ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందని చెప్పాలి. అమరావతిని రాజధానిగా ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల వారు మాత్రమే మద్దతు ఇస్తారన్న ప్రచారం తప్పన్నది తేలింది. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on April 25, 2023 2:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

27 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago