Political News

కరోనా డేంజర్ బెల్స్… మే నెలలో విశ్వరూపమేనట

ప్రాణాంతక వైరస్ కరోనా విశ్యవ్యాప్తంగా ఇప్పుడు విలయ తాండవమే చేస్తోంది. అందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదనే చెప్పాలి. ఇప్పటికే భారత్ లో 21 వేల మందికి పైగా సోకిన ఈ వైరస్ 686 మంది ప్రాణాలను బలిగొంది.

ఈ వైరస్ కట్టడి కోసమంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దాదాపుగా నెల రోజులు పూర్తి అయ్యింది. మే నెల 3 వరకు ప్రస్తుత లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపు… ప్రొటివిటీ అనే సంస్థతో కలిసి చేసిన ఓ సర్వే ఆందోళన రేకెత్తిస్తోంది. మే నెలలో కరోనా మహమ్మారి విస్తృతి భారత్ లో ఓ రేంజిలో ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.

కరోనా మహమ్మారి పుట్టిన చైనాతో పాటు దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా విజృంభణను భారత గణాంకాలతో పోలుస్తూ సాగిన ఈ సర్వే… భారత్ లో మే 22 నాటికి కరోనా రోగుల సంఖ్య 75 వేల మార్కును దాటిపోనుందని అంచనా వేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ లాక్ డౌన్ ముగిసే మే 3 నాటికి 38 వేల మార్కును టచ్ చేయనున్న కరోనా విస్తృతి…మే 8 నాటికి 46 వేల మార్కును దాటేస్తుందట. అంతేకాకుండా మే 14 నాటికి మరింత విజృంభించనున్న కరోనా… ఏకంగా 65 వేల మార్కును దాటిపోయి మే 22 నాటికి 75 వేల మార్కును చేరుతుందట.

మొత్తంగా కరోనా కట్టడిలో మిగిలిన దేశాలన్నింటికంటే కూడా మెరుగైన చర్యలు తీసుకుంటున్న భారత్ లో ఈ వైరస్ ఏకంగా 75 వేల మందికి పైగా సోకనుందన్న ఈ సర్వే నిజంగానే ఆందోళనను రేకెత్తించేదిగానే ఉందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే… లాక్ డౌన్ ను మే3 నాటికే పరిమితం చేస్తే కరోనా విస్తృతిని కట్టడి చేయలేమని చెప్పేసిన ఈ సర్వే… అసలు భారత్ లో కరోనా రోగుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చేందుకు ఏం చేయాలన్న విషయాలపైనా ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. మే 3న రెండో దశ లాక్ డౌన్ ముగిసినా… లాక్ డౌన్ ను మరింత కాలం పాటు పొడిగించడమే మంచిదన్న విషయాన్ని చెప్పిన ఈ సర్వే… మే 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే… దేశంలో కరోనా కేసులు జీరో స్థాయికి చేరడానికి సెప్టెంబర్ 15దాకా సమయం పడుతుందని తెలిపింది.

అదే సమయంలో లాక్ డౌన్ ను మే చివరి దాకా పొడిగిస్తే… జూన్ మధ్యలోనే కేసుల సంఖ్య జీరో స్థాయికి పడిపోతుందని ఈ సర్వే చెప్పింది. మొత్తంగా దేశంలో కరోనా విస్తృతి, కేసుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఈ సర్వే చెప్పిన అంశాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on April 23, 2020 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

3 hours ago

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

6 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

7 hours ago

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…

13 hours ago

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

14 hours ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

15 hours ago