Political News

కరోనా డేంజర్ బెల్స్… మే నెలలో విశ్వరూపమేనట

ప్రాణాంతక వైరస్ కరోనా విశ్యవ్యాప్తంగా ఇప్పుడు విలయ తాండవమే చేస్తోంది. అందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదనే చెప్పాలి. ఇప్పటికే భారత్ లో 21 వేల మందికి పైగా సోకిన ఈ వైరస్ 686 మంది ప్రాణాలను బలిగొంది.

ఈ వైరస్ కట్టడి కోసమంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దాదాపుగా నెల రోజులు పూర్తి అయ్యింది. మే నెల 3 వరకు ప్రస్తుత లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపు… ప్రొటివిటీ అనే సంస్థతో కలిసి చేసిన ఓ సర్వే ఆందోళన రేకెత్తిస్తోంది. మే నెలలో కరోనా మహమ్మారి విస్తృతి భారత్ లో ఓ రేంజిలో ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.

కరోనా మహమ్మారి పుట్టిన చైనాతో పాటు దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా విజృంభణను భారత గణాంకాలతో పోలుస్తూ సాగిన ఈ సర్వే… భారత్ లో మే 22 నాటికి కరోనా రోగుల సంఖ్య 75 వేల మార్కును దాటిపోనుందని అంచనా వేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ లాక్ డౌన్ ముగిసే మే 3 నాటికి 38 వేల మార్కును టచ్ చేయనున్న కరోనా విస్తృతి…మే 8 నాటికి 46 వేల మార్కును దాటేస్తుందట. అంతేకాకుండా మే 14 నాటికి మరింత విజృంభించనున్న కరోనా… ఏకంగా 65 వేల మార్కును దాటిపోయి మే 22 నాటికి 75 వేల మార్కును చేరుతుందట.

మొత్తంగా కరోనా కట్టడిలో మిగిలిన దేశాలన్నింటికంటే కూడా మెరుగైన చర్యలు తీసుకుంటున్న భారత్ లో ఈ వైరస్ ఏకంగా 75 వేల మందికి పైగా సోకనుందన్న ఈ సర్వే నిజంగానే ఆందోళనను రేకెత్తించేదిగానే ఉందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే… లాక్ డౌన్ ను మే3 నాటికే పరిమితం చేస్తే కరోనా విస్తృతిని కట్టడి చేయలేమని చెప్పేసిన ఈ సర్వే… అసలు భారత్ లో కరోనా రోగుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చేందుకు ఏం చేయాలన్న విషయాలపైనా ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. మే 3న రెండో దశ లాక్ డౌన్ ముగిసినా… లాక్ డౌన్ ను మరింత కాలం పాటు పొడిగించడమే మంచిదన్న విషయాన్ని చెప్పిన ఈ సర్వే… మే 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే… దేశంలో కరోనా కేసులు జీరో స్థాయికి చేరడానికి సెప్టెంబర్ 15దాకా సమయం పడుతుందని తెలిపింది.

అదే సమయంలో లాక్ డౌన్ ను మే చివరి దాకా పొడిగిస్తే… జూన్ మధ్యలోనే కేసుల సంఖ్య జీరో స్థాయికి పడిపోతుందని ఈ సర్వే చెప్పింది. మొత్తంగా దేశంలో కరోనా విస్తృతి, కేసుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఈ సర్వే చెప్పిన అంశాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on April 23, 2020 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago