Political News

కరోనా డేంజర్ బెల్స్… మే నెలలో విశ్వరూపమేనట

ప్రాణాంతక వైరస్ కరోనా విశ్యవ్యాప్తంగా ఇప్పుడు విలయ తాండవమే చేస్తోంది. అందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదనే చెప్పాలి. ఇప్పటికే భారత్ లో 21 వేల మందికి పైగా సోకిన ఈ వైరస్ 686 మంది ప్రాణాలను బలిగొంది.

ఈ వైరస్ కట్టడి కోసమంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దాదాపుగా నెల రోజులు పూర్తి అయ్యింది. మే నెల 3 వరకు ప్రస్తుత లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపు… ప్రొటివిటీ అనే సంస్థతో కలిసి చేసిన ఓ సర్వే ఆందోళన రేకెత్తిస్తోంది. మే నెలలో కరోనా మహమ్మారి విస్తృతి భారత్ లో ఓ రేంజిలో ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.

కరోనా మహమ్మారి పుట్టిన చైనాతో పాటు దక్షిణ కొరియా, అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా విజృంభణను భారత గణాంకాలతో పోలుస్తూ సాగిన ఈ సర్వే… భారత్ లో మే 22 నాటికి కరోనా రోగుల సంఖ్య 75 వేల మార్కును దాటిపోనుందని అంచనా వేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ లాక్ డౌన్ ముగిసే మే 3 నాటికి 38 వేల మార్కును టచ్ చేయనున్న కరోనా విస్తృతి…మే 8 నాటికి 46 వేల మార్కును దాటేస్తుందట. అంతేకాకుండా మే 14 నాటికి మరింత విజృంభించనున్న కరోనా… ఏకంగా 65 వేల మార్కును దాటిపోయి మే 22 నాటికి 75 వేల మార్కును చేరుతుందట.

మొత్తంగా కరోనా కట్టడిలో మిగిలిన దేశాలన్నింటికంటే కూడా మెరుగైన చర్యలు తీసుకుంటున్న భారత్ లో ఈ వైరస్ ఏకంగా 75 వేల మందికి పైగా సోకనుందన్న ఈ సర్వే నిజంగానే ఆందోళనను రేకెత్తించేదిగానే ఉందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే… లాక్ డౌన్ ను మే3 నాటికే పరిమితం చేస్తే కరోనా విస్తృతిని కట్టడి చేయలేమని చెప్పేసిన ఈ సర్వే… అసలు భారత్ లో కరోనా రోగుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చేందుకు ఏం చేయాలన్న విషయాలపైనా ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. మే 3న రెండో దశ లాక్ డౌన్ ముగిసినా… లాక్ డౌన్ ను మరింత కాలం పాటు పొడిగించడమే మంచిదన్న విషయాన్ని చెప్పిన ఈ సర్వే… మే 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే… దేశంలో కరోనా కేసులు జీరో స్థాయికి చేరడానికి సెప్టెంబర్ 15దాకా సమయం పడుతుందని తెలిపింది.

అదే సమయంలో లాక్ డౌన్ ను మే చివరి దాకా పొడిగిస్తే… జూన్ మధ్యలోనే కేసుల సంఖ్య జీరో స్థాయికి పడిపోతుందని ఈ సర్వే చెప్పింది. మొత్తంగా దేశంలో కరోనా విస్తృతి, కేసుల సంఖ్యను జీరో స్థాయికి చేర్చాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఈ సర్వే చెప్పిన అంశాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on April 23, 2020 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

1 hour ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

9 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago