Political News

ఇలాంటి సర్వేలతో చేటే ఎక్కువ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లో చాలామంది నిన్నట్నుంచి సంబరాల మోడ్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించిన సర్వేలో తేలడమే అందుక్కారణం.

ఏపీలో ఉన్న ఎంపీ సీట్లే 25 అయితే.. ఆ పార్టీ 24 లేదా 25 స్థానాలు దక్కించుకుంటుందని టైమ్స్ నౌ ప్రకటించింది. కేంద్రంలో మోడీ హవా కొనసాగనున్నట్లు.. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్‌‌ మెజారిటీ సీట్లు దక్కించుకోనున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఐతే మిగతా పార్టీల విషయంలో సర్వే అంచనాలు వాస్తవంగానే అనిపిస్తున్నప్పటికీ.. వైసీపీ మరోసారి ఏపీలో క్వీన్ స్వీప్ చేయబోతోందని.. గత పర్యాయం సాధించిన 23 సీట్లను కూడా మించబోతోందని ఈ సర్వే ప్రకటించడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వైసీపీ పై గత ఏడాది కాలంలో విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ ప్రభావం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జనాల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితి వస్తోంది. వాళ్లు వెళ్లినా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తుగా ఓడిపోతారని గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్లు అంటున్నారు. జగన్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడం ఆశ్చర్యకరం. వైసీపీలోనే చాలామంది ఈ సర్వేను నమ్మట్లేదు. చాలామంది ఈ సర్వే మీద కామెడీ చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఇతర వ్యవహారాలతో ఢీలా పడ్డ వైసీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి ఈ సర్వేను మేనేజ్ చేశారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ అయితే ఈ సర్వేను చూసి ఎంతమాత్రం కంగారు పడట్టేదు. అదొక ఫేక్ సర్వే అని బలంగా నమ్ముతోంది. అందుకే చాలా లైట్ అన్నట్లు ఉంటున్నారు ఆ పార్టీ మద్దతుదారులు. న్యూట్రల్‌గా ఉండేవాళ్లకైతే ఈ సర్వే మీద ఎంతమాత్రం నమ్మకం కుదరట్లేదు.

దీన్ని కామెడీగా తీసుకుంటున్నారు. ఈ సర్వేలో వైసీపీకి 15 ప్లస్ సీట్లు వస్తాయని పేర్కొని ఉంటే రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉండేదేమో. అప్పుడు టీడీపీ కంగారు పడేది. జగన్ గ్రాఫ్ పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా ఇప్పటికీ తమదే ఆధిక్యం అని వైసీపీలో జోష్ వచ్చేది. అలా కాకుండా క్లీన్ స్వీప్ సంకేతాలు రావడంతో వైసీపీలోనే ఒక వర్గం ఈ సర్వేను లైట్ తీసుకుంటోంది. ఈ సర్వేను నమ్మే వైసీపీ సపోర్టర్లలో ఓవర్ కాన్ఫిడెన్స్‌ వచ్చినా అదీ ప్రమాదమే. ఇలా ఏ రకంగా చూసినా ఈ సర్వే వైసీపీకి ఉపయోగపడేది కాదని జగన్ అండ్ కో అర్థం చేసుకుంటే మంచిది.

This post was last modified on April 22, 2023 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

1 minute ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

9 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

2 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

8 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

12 hours ago