Political News

చంద్రబాబుకు రాయపాటి టెన్షన్

టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు శిరోభారమయ్యారు. కంట్లో నలుసుల్లా తయారై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఏడిపిస్తున్నారు. ఒకటికెట్ ఇవ్వడమే గగనమని చంద్రబాబు లెక్కలేసుకుంటుంటే.. ఇంటికి రెండు మూడు టికెట్లు అడుగుతూ వేధిస్తున్నారు. పైగా పార్టీని, అధినేతను బ్లాక్ మెయిల్ చేసేందుకు వెనుకాడటం లేదు.

కాళ్లు కదలక వీల్ ఛైర్లో తిరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా నేత రాయపాటి సాంబశివరావు కూడా ఇప్పుడు బ్లాక్ మేయిలర్ల జాబితాలో చేరారు. రెండు నెలల పాటు మౌనంగా ఉన్న రాయపాటి మళ్లీ మీడియా ముందుకు వచ్చి టికెట్ల పంచాయతీ మొదలు పెట్టారు. చంద్రబాబు చెబితే నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎవరో అడిగినట్లుగానే ఆయన ప్రకటించేశారు. పైగా గతంలో డబ్బులు లేక ఓడిపోయానని రాయపాటి చెప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పార్టీ శ్రేణలు టెన్షన్ పడుతున్నాయి.

ఎంపీ సీటు ఇస్తారా లేక రెండు ఎమ్మెల్యే బీ- ఫార్మ్ లు ఇస్తారా అని అడుగుతూ ఆయన చంద్రబాబుకు పరోక్షంగా సందేశమిస్తున్నారు తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు టీడీపీ టికెట్ కావాలని రాయపాటి తెగేసి చెబుతున్నారు. తన తమ్ముడు కూతురు శైలజకు కూడా టికెట్ ఇవ్వాలంటున్నారు. పిల్లలిద్దరికీ టికెట్లు ఇస్తే తనకు ఇవ్వకపోయినా ఫర్వాలేదంటూ ఉదార స్వరాన్ని రాయపాటి వినిపిస్తున్నారు.

పైగా నరసరావుపేట లోక్ సభా స్థానాన్ని స్థానికులకే కేటాయించాలని రాయపాటి కొత్త మెలిక పెట్టారు. చాలా రోజులుగా అక్కడా ఇక్కడా చెబుతూ వచ్చిన రాయపాటి ఇప్పుడు నేరుగానే మీడియా ముందు కక్కేశారు. పేట టికెట్ ను టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో డిసైడయ్యారు. పుట్టా కుటుంబానికి కూడా సంకేతం అందడంతో , క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు రాయపాటి లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తేవడంతో అది వైసీపీకి ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి రాయపాటి వ్యవహారాన్ని పార్టీకి అనుకూలంగా చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి..

This post was last modified on April 22, 2023 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

42 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago