ఏపీ మంత్రి, విద్యావేత్త, కేంద్ర మాజీ అధికారి ఆదిమూలపు సురేష్ హల్చల్ చేశారు. నడిరోడ్డుపై చొక్కా విప్పేసి.. టీడీపీ నేతలకు సవాళ్లు రువ్వారు. దీంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో ఇక్కడ హై టెన్షన్ కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూ లపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డుపైకి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రితోపాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, నల్లబెలూన్లతో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు.
ఈ క్రమంలో మంత్రి తన చొక్కా విప్పిన నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్ చేసిందనే విమర్శలు టీడీపీ నుంచి వినిపించాయి. మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు.. టీడీపీ నాయకులు తనను తగలబెడతానన్నారని, దమ్ముంటే ఆపని చేయాలని మంత్రి సురేష్ సవాల్ రువ్వారు. ఈ క్రమంలోనే ఆయన చొక్కా విప్పి మరీ సవాళ్లకు దిగడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు.
దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం అని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. తనను టీడీపీ నేతలు తగలబెడతామన్నారని.. దమ్ముంటే తగల బెట్టాలని ఆయన సవాల్ రువ్వారు.
This post was last modified on April 22, 2023 10:54 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…