ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సమావేశం సందర్భంగా రామచంద్ర ప్రభు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడైన తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకకటించారు. ఏపీ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పుకున్నారు..
నాడు ప్రజారాజ్యం అభ్యర్థి
గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో పుట్టిన తులసీ రామచంద్రప్రభు… మద్రాసు ఐఐటీలో చదివారు. ఉద్యోగం చేయకుండా వ్యాపారంలోకి దిగి బాగా రాణించారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని పీఆర్పీలో చేరి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓడిపోయారు. వ్యాపార రంగంలో ఆయన పేరు మారుమోగిపోతూనే ఉంది. ఐదు జాతీయ అవార్డులు పొందిన గుంటూరు వ్యాపారిగా ఆయనకు పేరుంది..
సేవా కార్యక్రమాల్లో అగ్రగామి
కోస్తాంధ్ర జిల్లాలో సేవాకార్యక్రమాలకు రామచంద్రప్రభు ముందుంటారనే పేరుంది. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంటారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జిజీహెచ్ ) కు రోజు రెండు వాటర్ ట్యాంకర్ల నీళ్లు అందించే సేవా పథకానికి రామచంద్రప్రభు ఇటీవలే శ్రీకారం చుట్టారు. గుంటూరు వైద్యుల ప్రశంసలు పొందారు..
2024 ఎన్నికల్లో రామచంద్ర ప్రభు గుంటూరు పార్లమెంటు లేదా.. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వ్యాపారులు హిందూత్వవాదాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో అది రామచంద్రప్రభు అభ్యర్థిత్వానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…
బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…
ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్…
ఐపీఎల్ 2026లో చాలా మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడటం లేదు, కానీ అందరి కళ్లు మాత్రం పంత్, రుతురాజ్, సూర్య…
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…