రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్రమోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల్లో కొందరు హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మోడీ మాత్రం ఏకంగ ప్రధానమంత్రి పదవి కోసం హ్యాట్రిక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు సరే మరి సాధ్యమవుతుందా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే రిపోర్టు ప్రకారం మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో బీజేపీ కూటమి మంచి మెజారిటితోనే మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ కూటమికి 292-338 సీట్లు రావటం ఖాయమని తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమికి 106-144 సీట్లు వస్తాయట. ఇతరులకు అంటే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు 66-96 సీట్లు గెలుస్తాయని సర్వేలే తేలిందట. ప్రధానమంత్రి అభ్యర్ధిగా నరేంద్రమోడీకి 64 శాతం మంది మద్దతు పలికారట. రాహుల్ గాంధీకి 13 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 12 శాతం మంది జనాలు ప్రధానమంత్రి పోస్టుకు మద్దతు పలికారట.
బీజేపీ కూటమికి 38.2, కాంగ్రెస్ కూటమికి 28.7 శాతం, ఇతరులకు 33 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని సదరు సంస్ధలు చెప్పాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఎన్డీయే సీట్ల పెరుగుదలలో పెద్ద ప్లస్సేమీలేదు. ఇప్పుడున్న సీట్లు సుమారు 320. అంటే అదనంగా మరో 18 మాత్రమే వస్తాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. అలాగే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ సీట్ల సంఖ్య దాదాపు వందకు చేరుకుంటాయి.
అంటే ఇప్పటికన్నా పార్లమెంటులో రేపటి ఎన్నికల తర్వాత బలమైన ప్రతిపక్షం తయారవుతుందని అర్ధమవుతోంది. బీజేపీ కూటమికి 338 సీట్లు వస్తాయంటే పెద్దగా పెరుగుదల లేదని అర్ధమవుతోంది. కాకపోతే బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి మూడోసారి కూడా బీజేపీ కూటమే అధికారంలోకి వస్తోంది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీకి 24 లేదా 25 పార్లమెంటు సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అంటే వైనాట్ 175 ? అనే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ నిజమవుతుందా ?
This post was last modified on April 22, 2023 9:34 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…