రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్రమోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల్లో కొందరు హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మోడీ మాత్రం ఏకంగ ప్రధానమంత్రి పదవి కోసం హ్యాట్రిక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు సరే మరి సాధ్యమవుతుందా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే రిపోర్టు ప్రకారం మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో బీజేపీ కూటమి మంచి మెజారిటితోనే మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ కూటమికి 292-338 సీట్లు రావటం ఖాయమని తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమికి 106-144 సీట్లు వస్తాయట. ఇతరులకు అంటే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు 66-96 సీట్లు గెలుస్తాయని సర్వేలే తేలిందట. ప్రధానమంత్రి అభ్యర్ధిగా నరేంద్రమోడీకి 64 శాతం మంది మద్దతు పలికారట. రాహుల్ గాంధీకి 13 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 12 శాతం మంది జనాలు ప్రధానమంత్రి పోస్టుకు మద్దతు పలికారట.
బీజేపీ కూటమికి 38.2, కాంగ్రెస్ కూటమికి 28.7 శాతం, ఇతరులకు 33 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని సదరు సంస్ధలు చెప్పాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఎన్డీయే సీట్ల పెరుగుదలలో పెద్ద ప్లస్సేమీలేదు. ఇప్పుడున్న సీట్లు సుమారు 320. అంటే అదనంగా మరో 18 మాత్రమే వస్తాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. అలాగే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ సీట్ల సంఖ్య దాదాపు వందకు చేరుకుంటాయి.
అంటే ఇప్పటికన్నా పార్లమెంటులో రేపటి ఎన్నికల తర్వాత బలమైన ప్రతిపక్షం తయారవుతుందని అర్ధమవుతోంది. బీజేపీ కూటమికి 338 సీట్లు వస్తాయంటే పెద్దగా పెరుగుదల లేదని అర్ధమవుతోంది. కాకపోతే బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి మూడోసారి కూడా బీజేపీ కూటమే అధికారంలోకి వస్తోంది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీకి 24 లేదా 25 పార్లమెంటు సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అంటే వైనాట్ 175 ? అనే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ నిజమవుతుందా ?
This post was last modified on April 22, 2023 9:34 am
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…
బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…
ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్…
ఐపీఎల్ 2026లో చాలా మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడటం లేదు, కానీ అందరి కళ్లు మాత్రం పంత్, రుతురాజ్, సూర్య…
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…