సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, హత్యకన్నా ఎక్కువగా ఇప్పుడు తెరమీదికి వస్తున్న ట్విస్టులపై ట్విస్టులు మరింతగా కేసును ఉత్కంఠగా మార్చాయి. వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తును కోరడం.. తర్వాత పరిణామాల్లో ఏకంగా కడప ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిస్తుండడం కేసు తీవ్రతను పెంచేసేంది. ఇంతలో తెరమీదికి వచ్చిన వివేకా రెండో భార్య,ముస్లిం వర్గానికి చెందిన షేక్ షమీమ్.. కూడా తెరమీదికి వచ్చారు.
తాజాగా ఆమె నుంచి సీబీఐ అధికారులు స్టేట్మెంటునురికార్డు చేశారు. దీంతో పాటు.. ఆమె సీబీఐకి మూడు పేజీల తన వాదనను రికార్డుగా అందించారు. అదేసమయంలో వివేకాకు సంబంధించిన ఆస్తులు, వ్యవహారాలు.. రాజకీయం.. కుటుంబ తగాదాలను కూడా షమీమ్ వ్యక్త పరిచారు. ఇక, సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ స్టేట్మెంట్లో ప్రస్తుతం జైల్లో ఉన్న ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.
2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు బెంగళూరులో వివాహం జరిగిందని షమీమ్ వివరించారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేదని.. అనేక సందర్భాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయని ఆమె వివరించారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు భూ సెటిట్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పినట్టు వివరించారు.
తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీమ్ తెలిపారు, వివేకా కుటుంబ సభ్యులు మమ్మల్ని దూరం పెట్టారు. దీంతో నేను, నా కొడుకుతో బెంగళూరులోనే ఉండిపోయారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే వివేకా చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్ను తొలగించారు. మా అబ్బాయికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామన్నారు. అక్కడే ఇల్లు కూడా కట్టిస్తమని చెప్పారు. అని షమీమ్ వివరించారు. దీంతో ఈ కేసు ఎటు మలుపుతిరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది.
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…