సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, హత్యకన్నా ఎక్కువగా ఇప్పుడు తెరమీదికి వస్తున్న ట్విస్టులపై ట్విస్టులు మరింతగా కేసును ఉత్కంఠగా మార్చాయి. వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తును కోరడం.. తర్వాత పరిణామాల్లో ఏకంగా కడప ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిస్తుండడం కేసు తీవ్రతను పెంచేసేంది. ఇంతలో తెరమీదికి వచ్చిన వివేకా రెండో భార్య,ముస్లిం వర్గానికి చెందిన షేక్ షమీమ్.. కూడా తెరమీదికి వచ్చారు.
తాజాగా ఆమె నుంచి సీబీఐ అధికారులు స్టేట్మెంటునురికార్డు చేశారు. దీంతో పాటు.. ఆమె సీబీఐకి మూడు పేజీల తన వాదనను రికార్డుగా అందించారు. అదేసమయంలో వివేకాకు సంబంధించిన ఆస్తులు, వ్యవహారాలు.. రాజకీయం.. కుటుంబ తగాదాలను కూడా షమీమ్ వ్యక్త పరిచారు. ఇక, సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ స్టేట్మెంట్లో ప్రస్తుతం జైల్లో ఉన్న ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.
2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు బెంగళూరులో వివాహం జరిగిందని షమీమ్ వివరించారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేదని.. అనేక సందర్భాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయని ఆమె వివరించారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు భూ సెటిట్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పినట్టు వివరించారు.
తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీమ్ తెలిపారు, వివేకా కుటుంబ సభ్యులు మమ్మల్ని దూరం పెట్టారు. దీంతో నేను, నా కొడుకుతో బెంగళూరులోనే ఉండిపోయారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే వివేకా చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్ను తొలగించారు. మా అబ్బాయికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామన్నారు. అక్కడే ఇల్లు కూడా కట్టిస్తమని చెప్పారు. అని షమీమ్ వివరించారు. దీంతో ఈ కేసు ఎటు మలుపుతిరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది.
This post was last modified on April 21, 2023 10:51 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…