ఆ పార్టీ నేతలు,శ్రేణుల తీరు కూడా ఆరోపణలను బలపరిచేదిగా ఉంటుంది. తాజాగా ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో వైసీపీ రెచ్చిపోయి అరాచకం సృష్టించింది. స్వయంగా మంత్రి అయిన ఎమ్మెల్యే రంగంలోకి దిగి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించారు.
ప్లకార్డుల ప్రదర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనను అడ్డుకునేందుకు ప్లకార్డులు, నల్లబెలూన్లతో వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. వారికి మంత్రి ఆదిమూలపు సురేష్ నాయకత్వం వహించడమే కాకుండా చొక్కా విప్పి మరీ సవాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఎస్సీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెట్టారు.
చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు
వైసీపీ శ్రేణులు చంద్రబాబు వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. దానితో కొందరికి గాయాలయ్యాయి. వాహనం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మంత్రి సురేష్ కార్యాలయం ఎదురుగానే వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. మరో పక్క వైసీపీ శ్రేణులను నిలువరించాల్సిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టేశారు. స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేసినట్లు సమాచారం.
కమాండోకు కుట్లు
వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో చంద్రబాబులో సెక్యూరిటీలోని NSG కమాండెంట్ సంతోష్కుమార్ తలకు గాయమైంది. దాడి సమయంలో చంద్రబాబుకు రక్షణగా NSG కమాండోస్ నిలిచారు. అదే సమయంలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. వైసీపీ రాళ్ల దాడిలో సంతోష్కుమార్ తలకు గాయం అయ్యింది. సంతోష్కుమార్కు వైద్యులు మూడు కుట్లు వేసి కట్టుకట్టారు.
This post was last modified on April 21, 2023 10:47 pm
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…