Political News

ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు పెత్తనం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కీలక దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోకి యాత్ర ప్రవేశించడంతో వెయ్యి కిలోమీటర్ల మైలు దాటినట్లయ్యింది. ప్రతీ వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్లకు కూడా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్‌ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను.

నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు

ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై లోకేష్ ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అదోనిని ముంబైలా మార్చేస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గాన్ని అథోగతి పాలు చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ ఎమ్మెల్యేల్లాగే పెత్తనం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కలా పంచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. కొడుక్కి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారని లోకేష్ వెల్లడించారు. ఆదోనిలో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు అని అంటూ.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కాదని, ఆయన క్యాష్ ప్రసాద్ అని వివరించారు.

సాయి ప్రసాద్‌కు ప్రతీ రోజు క్యాష్ లెక్కపెట్టుకోవడమే పనిగా మారిందన్నారు. కబ్జా చేసిన భూములతో కొత్త వెంచర్లు వేస్తున్నారన్నారు. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండను మింగేశారన్నారు. ప్రజలకు సేవ చేసే ఎన్జీవోలను కూడా భయపెడుతున్నారన్నారు.

కర్ణాటక మద్యం విక్రయం

కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే వర్గీయులు ఆదోనిలో విక్రయిస్తున్నారన్నారు. అందులోంచి ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలన్నారు. పైగా నియోజకవర్గంలో బియ్యం మాఫియా కూడా నడుస్తోందని లోకేష్ అన్నారు. క్యాష్ ప్రసాద్ అవినీతితో బైపాస్ పనులు కూడా ఆగిపోయాయన్నారు.

లోకేష్‌ ఎక్కడికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే అవినీతిని, అరాచకాలను బయటకు తీస్తున్నారు. ఆ క్రమంలో ఆదోనీ ఎమ్మెల్యే బాగోతాన్ని కూడా బట్టబయలు చేశారు.

This post was last modified on April 21, 2023 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

48 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago