టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కీలక దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోకి యాత్ర ప్రవేశించడంతో వెయ్యి కిలోమీటర్ల మైలు దాటినట్లయ్యింది. ప్రతీ వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్లకు కూడా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను.
నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు
ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై లోకేష్ ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. అదోనిని ముంబైలా మార్చేస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గాన్ని అథోగతి పాలు చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ ఎమ్మెల్యేల్లాగే పెత్తనం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కలా పంచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. కొడుక్కి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారని లోకేష్ వెల్లడించారు. ఆదోనిలో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు అని అంటూ.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కాదని, ఆయన క్యాష్ ప్రసాద్ అని వివరించారు.
సాయి ప్రసాద్కు ప్రతీ రోజు క్యాష్ లెక్కపెట్టుకోవడమే పనిగా మారిందన్నారు. కబ్జా చేసిన భూములతో కొత్త వెంచర్లు వేస్తున్నారన్నారు. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండను మింగేశారన్నారు. ప్రజలకు సేవ చేసే ఎన్జీవోలను కూడా భయపెడుతున్నారన్నారు.
కర్ణాటక మద్యం విక్రయం
కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే వర్గీయులు ఆదోనిలో విక్రయిస్తున్నారన్నారు. అందులోంచి ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలన్నారు. పైగా నియోజకవర్గంలో బియ్యం మాఫియా కూడా నడుస్తోందని లోకేష్ అన్నారు. క్యాష్ ప్రసాద్ అవినీతితో బైపాస్ పనులు కూడా ఆగిపోయాయన్నారు.
లోకేష్ ఎక్కడికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే అవినీతిని, అరాచకాలను బయటకు తీస్తున్నారు. ఆ క్రమంలో ఆదోనీ ఎమ్మెల్యే బాగోతాన్ని కూడా బట్టబయలు చేశారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…