Political News

ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు పెత్తనం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కీలక దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోకి యాత్ర ప్రవేశించడంతో వెయ్యి కిలోమీటర్ల మైలు దాటినట్లయ్యింది. ప్రతీ వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్లకు కూడా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్‌ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను.

నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు

ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై లోకేష్ ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అదోనిని ముంబైలా మార్చేస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గాన్ని అథోగతి పాలు చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ ఎమ్మెల్యేల్లాగే పెత్తనం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కలా పంచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. కొడుక్కి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారని లోకేష్ వెల్లడించారు. ఆదోనిలో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు అని అంటూ.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కాదని, ఆయన క్యాష్ ప్రసాద్ అని వివరించారు.

సాయి ప్రసాద్‌కు ప్రతీ రోజు క్యాష్ లెక్కపెట్టుకోవడమే పనిగా మారిందన్నారు. కబ్జా చేసిన భూములతో కొత్త వెంచర్లు వేస్తున్నారన్నారు. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండను మింగేశారన్నారు. ప్రజలకు సేవ చేసే ఎన్జీవోలను కూడా భయపెడుతున్నారన్నారు.

కర్ణాటక మద్యం విక్రయం

కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే వర్గీయులు ఆదోనిలో విక్రయిస్తున్నారన్నారు. అందులోంచి ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలన్నారు. పైగా నియోజకవర్గంలో బియ్యం మాఫియా కూడా నడుస్తోందని లోకేష్ అన్నారు. క్యాష్ ప్రసాద్ అవినీతితో బైపాస్ పనులు కూడా ఆగిపోయాయన్నారు.

లోకేష్‌ ఎక్కడికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే అవినీతిని, అరాచకాలను బయటకు తీస్తున్నారు. ఆ క్రమంలో ఆదోనీ ఎమ్మెల్యే బాగోతాన్ని కూడా బట్టబయలు చేశారు.

Satya

Recent Posts

సినిమా కంటే బయట ప్రచారాలే బాగున్నాయి

తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…

4 hours ago

మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ…?

కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…

4 hours ago

చీరకే అందం తీసుకొచ్చిన శృతి

వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…

10 hours ago

చరణ్ మెచ్చుకున్న సినిమాలో ఏముంది

దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…

10 hours ago

ప్రశ్న రావణ్ కు ఏబీవీ మద్దతు?

ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…

12 hours ago

ముగిసిపోయిన పెద్ది కథలో చూడాల్సిన కోణం

పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…

13 hours ago