ఏపీలో పొత్తుల విషయంపై పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా ముందుకు సాగుతానని, ఎట్టి పరిస్థితి వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా పనిచేస్తానని కూడా పవన్ పలు సందర్భాల్లో వెల్లడించారు. దీంతో పవన్ .. పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారనే టాక్ జోరుగా వినిపించింది. ఇప్పటికే పవన్.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికలు ముగిసిన నాలుగు మాసాలకే ఆయన పొత్తు పెట్టుకున్నారు.
అయితే.. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. టీడీపీతో కలిసి ముందుకు సాగాలన్నది పవన్ వ్యూహంగా ఉంది. టీడీపీ కూడా ఇదే కోరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి ముందుకుసాగితే.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం తేలిక అవుతుందని భావిస్తున్నారు. అయితే.. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. కేవలం విజయవాడలోని ఓహోటల్లోను.. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలోనూ పవన్ భేటీ అయ్యారు.
అంతకుమించి.. పవన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే.. దీనికి కారణం.. ఏంటి? ఎవరు? అనే చర్చజోరుగా సాగుతోంది. తాజాగా టీడీపీ నేత,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత పవన్కల్యాణ్ టీడీపీతో కలవడానికి వస్తుంటే బీజేపీ ఆయనకు అడ్డుపడుతోందని అన్నారు. రాష్ట్రానికి అసలు బీజేపీ అవసరమా అని ప్రజలు ప్రశ్నించేరోజు దగ్గర్లో ఉందన్నారు.
అధికార వైసీపీ పార్టీకి తెరవెనుక కొమ్ముకాస్తుందో లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుందో బీజేపీ నాయకులు తేల్చి చెప్పాలన్నారు. తప్పులు చేసి తరచూ ఢిల్లీకి వెళ్తున్న సీఎం జగన్కు మద్దతుగా వ్యవ హరిస్తున్న కేంద్ర పెద్దలు.. రాష్ట్ర బాగు కోసం శ్రమిస్తున్న పవన్కల్యాణ్ను ఎందుకు ప్రోత్సహించలేక పోతున్నారో సమాధానం చెప్పాలని కోరారు. మొత్తానికి పవన్ ఎందుకు దూకుడుగా లేరనే విషయంపై మాత్రం ఇప్పుడు క్లారిటీ రావడం గమనార్హం.
This post was last modified on April 21, 2023 10:30 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…