Political News

చంద్రబాబు ఐడియాలజీ కాన్సెప్ట్ కు విశేష స్పందన

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజును జరుపుకుని 74వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఒక దసరాలా, ఒక దీపావళిలా, క్రిస్మస్ లా, ఒక రంజాన్ లా జరుపుకున్నారు. వాడవాడలా కేకులు కట్ చేశారు. చంద్రబాబు కూడా మార్కాపురం పట్టణంలో వేడుకలకు హాజరయ్యారు. తనకు పుట్టిన రోజు కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు.

చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి, రాష్ట్రానికి భవిష్యత్ దర్శినిని ఆవిష్కరించారు.తెలుగు ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా ఐడియాలజీ కాన్సెప్ట్ ను ఆయన ప్రకటించారు. పేదలను సంపన్నుల స్థాయికి అభివృద్ధి చేయడమే ఐడియాలజీ కాన్సెప్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రస్తావించారు. ఇంతవరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దాని ఆధారంగా ఐడియాలజీ కాన్సెప్ట్ విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. ఎకరం.. రెండెకరాలు ఉన్న రైతుల భూముల కూడా కోటి రూపాయల విలువ పలకడం అభివృద్ధికి నిదర్శనమన్నారు.

అభివృద్దికి ఒక రోజులో సాధ్యం కాదన్నది చంద్రబాబు చెప్పిన నిజం. 15 నుంచి 20 ఏళ్ల పాటు శ్రమిస్తేనే అభివృద్ధి ఫలాలు మన చేతికి అందుతాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడరేవులు, నగరాలను అవకాశాల గనిగా మార్చితే తన ఐడియాలజీ కాన్సెప్ట్ కల నెరవేరుతుందని చంద్రబాబు అన్నారు.

సంపన్నులు పేదలకు మెంటర్లుగా నిలిస్తే ఐడియాలజీ కాన్సెప్ట్ ను విజయవంతం చేయడం కష్టమేమీ కాదని చంద్రబాబు అన్నారు. సమిష్టి బాధ్యత తీసుకుంటే అభివృద్ధి తానంతట అదే జరుగుతుందని తన అభిప్రాయంగా చెప్పారు. ప్రభుత్వం కూడా తన వంతుగా కుటుంబాల వాస్తవ స్థితిగతులు అర్థం చేసుకుని మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలన్నారు. దీని కోసం టీడీపీ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేయించే పనిలో ఉంది. అధికారానికి వచ్చిన తర్వాత ఆ సాప్ఠ్ వేర్ ను ఉపయోగించి ప్రజల జీవితాలను మెరుగు పరచాలనుకుంటోంది. అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తారు.

తెలుగు వారు ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండలన్నది తన ఆలోచనగా చంద్రబాబు చెప్పుకున్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా సొంత గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని.. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా ప్రజల జీవితాలను సమూలంగా మార్చవచ్చని తెలిపారు. టెక్నాలజీ ద్వారా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. ఐడియాలజీతో, ప్రణాళికతో పనిచేయడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తెస్తానన్నారు. ఈ కాన్సెప్ట్‌ విజయవంతానికి ఐటీరంగ ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపిచ్చారు. పిల్లలు, మహిళలతో ఐడీయాలజీ కాన్సెప్ట్ విడుదల చేయించి చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. చంద్రబాబు ప్రతిపాదించిన ఐడియాలజీ కాన్సెప్ట్ ను వేర్వేరు రంగాల వారు, వృత్తి నిపుణలు స్వాగతిస్తున్నారు…

This post was last modified on April 21, 2023 8:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago