Political News

కేఏ పాల్..జేడీ ఏకమయ్యారా ?

సమాజంలో కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే విధానంపైన జనాల్లో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ మీద కూడా జనాల్లో కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అలాంటిది వీళ్ళద్దరి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనటమే చాలా విచిత్రంగా ఉంది. కేఏ పాల్ అంటే తెలుగురాజకీయాల్లో ఒక హస్యపాత్రగా జనాలు చూస్తున్నారు. నోటికేదొస్తే అది మాట్లాడేసే పాల్ తన చేష్టలతో జనాల దృష్టిలో చాలా చీపైపోయారు.

2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో రోడ్లపై పిచ్చి డ్యాన్సులు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా వేలు, లక్షల కోట్ల రూపాయల విరాళాలు తెచ్చేస్తానని చెబుతుంటారు. రెగ్యులర్ గా ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడే జనాల్లో జోకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యమధ్యలో లాజికల్ గా మాట్లాడినా జనాలు పట్టించుకోవటంలేదు.

ఇదే సమయంలో లక్ష్మీనారాయణంటే జనాల్లో మంచి రెస్పెక్టే ఉంది. ఐపీఎస్ ఉద్యోగం చేశారు కాబట్టి ఇంటలెక్చువల్ గా సమాజంలో గుర్తింపుంది. అలాంటి లక్ష్మీనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ప్రజల నుండి విరాళాలు అడగటంతోనే ఆయనపైన జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి బిడ్డింగ్ వేసి స్టీల్ ప్లాంట్ ను కొనాలనేది ఈయన ఆలోచన. ఎంతమంది విరాళాలిస్తే రు. 5 వేల కోట్లు వచ్చేను ? తర్వాత నిర్వహణ ఖర్చులను ఎలా భరిస్తారు ?

ఇలాంటి మాటల వల్ల తనకున్న ఇమేజిని ఈయనే తగ్గించుకుంటున్నారు. అలాంటిది హఠాత్తుగా కేఏపాల్ తో కలిసి లక్ష్మీనారాయణ మీడియా ముందు ప్రత్యక్షమవటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడారు. దాంతో పాల్ తో లక్ష్మీనారాయణ చేతులు కలిపారా అనే డౌటు పెరిగిపోతోంది. పాల్ తో కలవటంతోనే లక్ష్మీనారాయణ తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరి కొనేందుకు అమెరికా ఫండ్స్ తెస్తానని, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ కూడా ప్లాంట్ కొనేందుకు విరాళిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పాల్ చెప్పారు. అంటే విరాళాల సేకరణలోనే పాల్-లక్ష్మీనారాయణ ఏకమైనట్లు అర్ధమైపోతోంది .

This post was last modified on April 20, 2023 2:15 pm

Share

Recent Posts

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

5 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

6 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

6 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

7 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

9 hours ago