Political News

కేఏ పాల్..జేడీ ఏకమయ్యారా ?

సమాజంలో కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే విధానంపైన జనాల్లో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ మీద కూడా జనాల్లో కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అలాంటిది వీళ్ళద్దరి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనటమే చాలా విచిత్రంగా ఉంది. కేఏ పాల్ అంటే తెలుగురాజకీయాల్లో ఒక హస్యపాత్రగా జనాలు చూస్తున్నారు. నోటికేదొస్తే అది మాట్లాడేసే పాల్ తన చేష్టలతో జనాల దృష్టిలో చాలా చీపైపోయారు.

2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో రోడ్లపై పిచ్చి డ్యాన్సులు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా వేలు, లక్షల కోట్ల రూపాయల విరాళాలు తెచ్చేస్తానని చెబుతుంటారు. రెగ్యులర్ గా ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడే జనాల్లో జోకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యమధ్యలో లాజికల్ గా మాట్లాడినా జనాలు పట్టించుకోవటంలేదు.

ఇదే సమయంలో లక్ష్మీనారాయణంటే జనాల్లో మంచి రెస్పెక్టే ఉంది. ఐపీఎస్ ఉద్యోగం చేశారు కాబట్టి ఇంటలెక్చువల్ గా సమాజంలో గుర్తింపుంది. అలాంటి లక్ష్మీనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ప్రజల నుండి విరాళాలు అడగటంతోనే ఆయనపైన జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి బిడ్డింగ్ వేసి స్టీల్ ప్లాంట్ ను కొనాలనేది ఈయన ఆలోచన. ఎంతమంది విరాళాలిస్తే రు. 5 వేల కోట్లు వచ్చేను ? తర్వాత నిర్వహణ ఖర్చులను ఎలా భరిస్తారు ?

ఇలాంటి మాటల వల్ల తనకున్న ఇమేజిని ఈయనే తగ్గించుకుంటున్నారు. అలాంటిది హఠాత్తుగా కేఏపాల్ తో కలిసి లక్ష్మీనారాయణ మీడియా ముందు ప్రత్యక్షమవటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడారు. దాంతో పాల్ తో లక్ష్మీనారాయణ చేతులు కలిపారా అనే డౌటు పెరిగిపోతోంది. పాల్ తో కలవటంతోనే లక్ష్మీనారాయణ తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరి కొనేందుకు అమెరికా ఫండ్స్ తెస్తానని, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ కూడా ప్లాంట్ కొనేందుకు విరాళిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పాల్ చెప్పారు. అంటే విరాళాల సేకరణలోనే పాల్-లక్ష్మీనారాయణ ఏకమైనట్లు అర్ధమైపోతోంది .

This post was last modified on April 20, 2023 2:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

1 hour ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago