Political News

కేఏ పాల్..జేడీ ఏకమయ్యారా ?

సమాజంలో కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే విధానంపైన జనాల్లో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ మీద కూడా జనాల్లో కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అలాంటిది వీళ్ళద్దరి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనటమే చాలా విచిత్రంగా ఉంది. కేఏ పాల్ అంటే తెలుగురాజకీయాల్లో ఒక హస్యపాత్రగా జనాలు చూస్తున్నారు. నోటికేదొస్తే అది మాట్లాడేసే పాల్ తన చేష్టలతో జనాల దృష్టిలో చాలా చీపైపోయారు.

2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో రోడ్లపై పిచ్చి డ్యాన్సులు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా వేలు, లక్షల కోట్ల రూపాయల విరాళాలు తెచ్చేస్తానని చెబుతుంటారు. రెగ్యులర్ గా ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడే జనాల్లో జోకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యమధ్యలో లాజికల్ గా మాట్లాడినా జనాలు పట్టించుకోవటంలేదు.

ఇదే సమయంలో లక్ష్మీనారాయణంటే జనాల్లో మంచి రెస్పెక్టే ఉంది. ఐపీఎస్ ఉద్యోగం చేశారు కాబట్టి ఇంటలెక్చువల్ గా సమాజంలో గుర్తింపుంది. అలాంటి లక్ష్మీనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగులో పాల్గొనేందుకు ప్రజల నుండి విరాళాలు అడగటంతోనే ఆయనపైన జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి బిడ్డింగ్ వేసి స్టీల్ ప్లాంట్ ను కొనాలనేది ఈయన ఆలోచన. ఎంతమంది విరాళాలిస్తే రు. 5 వేల కోట్లు వచ్చేను ? తర్వాత నిర్వహణ ఖర్చులను ఎలా భరిస్తారు ?

ఇలాంటి మాటల వల్ల తనకున్న ఇమేజిని ఈయనే తగ్గించుకుంటున్నారు. అలాంటిది హఠాత్తుగా కేఏపాల్ తో కలిసి లక్ష్మీనారాయణ మీడియా ముందు ప్రత్యక్షమవటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడారు. దాంతో పాల్ తో లక్ష్మీనారాయణ చేతులు కలిపారా అనే డౌటు పెరిగిపోతోంది. పాల్ తో కలవటంతోనే లక్ష్మీనారాయణ తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరి కొనేందుకు అమెరికా ఫండ్స్ తెస్తానని, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ కూడా ప్లాంట్ కొనేందుకు విరాళిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పాల్ చెప్పారు. అంటే విరాళాల సేకరణలోనే పాల్-లక్ష్మీనారాయణ ఏకమైనట్లు అర్ధమైపోతోంది .

This post was last modified on April 20, 2023 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

1 hour ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

3 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

5 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago