Political News

రంగుల వివాదం.. ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వా కార్యాలయాలన్నింటికీ పార్టీ రంగులు వేయడం. ఐతే ముందు పంచాయితీ భవనాలతో మొదలైన రంగుల కార్యక్రమం.. ఆ తర్వాత అన్నింటికీ విస్తరించింది.

వాటర్ ట్యాంకర్లు.. బోర్లు.. స్కూళ్లు.. డివైడర్లు.. ఇలా దేన్నీ వదలకుండా కనిపించిన ప్రతి దానికీ వైకాపా రంగులేస్తూ పోయారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.

హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసి.. వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరినా ఒప్పుకోని హైకోర్టు.. స్థానిక ఎన్నికల కంటే ముందే రంగులు తీసేయాల్సిందే అని స్పష్టం చేసింది.

ఐతే రంగులేయడానికి ఇప్పటికే రూ.1500 కోట్ల దాకా ఖర్చు చేసిన జగన్ సర్కారు.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఈ సమయంలో మళ్లీ రంగుల తొలగింపు కోసం వందల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో ఉన్న రంగుల్నే కొద్దిగా మార్చే ప్రయత్నం చేసింది. దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉండటం గమనార్హం.

వైకాపా జెండా కలిసొచ్చేలా ఇంతకుముందు పచ్చ, తెలుపు, నీలి రంగులతో భవనాల్ని ముస్తాబు చేయగా.. అందులో అందులో కొంత మేర కాషాయ రంగు వేయడం ద్వారా మార్పు చూపించాలని చూస్తున్నారు. తద్వారా కోర్టుకు కొత్త రంగులేసినట్లు చూపించవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మెప్పించేలా ఆ పార్టీ రంగు వేసినట్లూ ఉంటుంది.

ఖర్చు తగ్గించుకోవడంతో పాటు కేంద్రాన్ని మెప్పించడం ద్వారా ఈ రంగుల గొడవ నుంచి బయటపడొచ్చని భావిస్తున్నట్లుంది. తెనాలిలో ఇలా మార్పు చూపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఐతే ఈ మార్పు విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

This post was last modified on April 23, 2020 5:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

54 seconds ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

22 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago