Political News

రంగుల వివాదం.. ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వా కార్యాలయాలన్నింటికీ పార్టీ రంగులు వేయడం. ఐతే ముందు పంచాయితీ భవనాలతో మొదలైన రంగుల కార్యక్రమం.. ఆ తర్వాత అన్నింటికీ విస్తరించింది.

వాటర్ ట్యాంకర్లు.. బోర్లు.. స్కూళ్లు.. డివైడర్లు.. ఇలా దేన్నీ వదలకుండా కనిపించిన ప్రతి దానికీ వైకాపా రంగులేస్తూ పోయారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.

హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసి.. వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరినా ఒప్పుకోని హైకోర్టు.. స్థానిక ఎన్నికల కంటే ముందే రంగులు తీసేయాల్సిందే అని స్పష్టం చేసింది.

ఐతే రంగులేయడానికి ఇప్పటికే రూ.1500 కోట్ల దాకా ఖర్చు చేసిన జగన్ సర్కారు.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఈ సమయంలో మళ్లీ రంగుల తొలగింపు కోసం వందల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో ఉన్న రంగుల్నే కొద్దిగా మార్చే ప్రయత్నం చేసింది. దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉండటం గమనార్హం.

వైకాపా జెండా కలిసొచ్చేలా ఇంతకుముందు పచ్చ, తెలుపు, నీలి రంగులతో భవనాల్ని ముస్తాబు చేయగా.. అందులో అందులో కొంత మేర కాషాయ రంగు వేయడం ద్వారా మార్పు చూపించాలని చూస్తున్నారు. తద్వారా కోర్టుకు కొత్త రంగులేసినట్లు చూపించవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మెప్పించేలా ఆ పార్టీ రంగు వేసినట్లూ ఉంటుంది.

ఖర్చు తగ్గించుకోవడంతో పాటు కేంద్రాన్ని మెప్పించడం ద్వారా ఈ రంగుల గొడవ నుంచి బయటపడొచ్చని భావిస్తున్నట్లుంది. తెనాలిలో ఇలా మార్పు చూపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఐతే ఈ మార్పు విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

This post was last modified on April 23, 2020 5:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 minutes ago

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత…

23 minutes ago

వద్దనుకున్న దర్శకుడితో నాని సినిమా ?

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…

42 minutes ago

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

1 hour ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

1 hour ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

1 hour ago