గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వా కార్యాలయాలన్నింటికీ పార్టీ రంగులు వేయడం. ఐతే ముందు పంచాయితీ భవనాలతో మొదలైన రంగుల కార్యక్రమం.. ఆ తర్వాత అన్నింటికీ విస్తరించింది.
వాటర్ ట్యాంకర్లు.. బోర్లు.. స్కూళ్లు.. డివైడర్లు.. ఇలా దేన్నీ వదలకుండా కనిపించిన ప్రతి దానికీ వైకాపా రంగులేస్తూ పోయారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.
హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసి.. వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరినా ఒప్పుకోని హైకోర్టు.. స్థానిక ఎన్నికల కంటే ముందే రంగులు తీసేయాల్సిందే అని స్పష్టం చేసింది.
ఐతే రంగులేయడానికి ఇప్పటికే రూ.1500 కోట్ల దాకా ఖర్చు చేసిన జగన్ సర్కారు.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఈ సమయంలో మళ్లీ రంగుల తొలగింపు కోసం వందల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో ఉన్న రంగుల్నే కొద్దిగా మార్చే ప్రయత్నం చేసింది. దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉండటం గమనార్హం.
వైకాపా జెండా కలిసొచ్చేలా ఇంతకుముందు పచ్చ, తెలుపు, నీలి రంగులతో భవనాల్ని ముస్తాబు చేయగా.. అందులో అందులో కొంత మేర కాషాయ రంగు వేయడం ద్వారా మార్పు చూపించాలని చూస్తున్నారు. తద్వారా కోర్టుకు కొత్త రంగులేసినట్లు చూపించవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మెప్పించేలా ఆ పార్టీ రంగు వేసినట్లూ ఉంటుంది.
ఖర్చు తగ్గించుకోవడంతో పాటు కేంద్రాన్ని మెప్పించడం ద్వారా ఈ రంగుల గొడవ నుంచి బయటపడొచ్చని భావిస్తున్నట్లుంది. తెనాలిలో ఇలా మార్పు చూపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఐతే ఈ మార్పు విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
This post was last modified on April 23, 2020 5:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…