బయటికెళ్తున్నారా… ఈ రూల్ తెలుసుకోండి

దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి, ఎవ్వరూ ఇళ్లు దాటి బయటికి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. అలాంటివారి కోసం మరో సరికొత్త రూల్ అమలులోకి తెచ్చారు తెలంగాణ పోలీసులు. ఎవ్వరైనా బయటికి వచ్చి, మూడు కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే, వారిని గుర్తించి భారీ జరిమానా విధించబోతున్నారు.

హైదరాబాద్ నగరంలో 250 జంక్షన్లలో కొన్ని వేల సీసీ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీంతో ఎవ్వరైనా ఇంటి నుంచి 3 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే, వారికి రూల్స్ అతిక్రమించినందుకు భారీగా ఫైన్ వసూలు చేయబోతున్నారు. బుధవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కార్లు, బైక్స్ ఈ రూల్‌ను అతిక్రమించి, బయట రోడ్ల మీద తిరిగినట్టు గుర్తించారు పోలీసులు. ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసినా, అనవసరంగా బయటికి రావద్దని చెప్పినా పట్టించుకోకుండా చాలామంది రోడ్లపైకి వస్తున్నారని తేలింది. ఇలా బయటికి వచ్చినవారిలో కొందరు రోడ్లపైన టిక్ టాక్ వీడియోలు చేస్తూ, సెల్ఫీలు తీసుకోవడం కూడా పోలీసులు గుర్తించారు.

ఇలాంటివారి భరతం పట్టేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ విధంగా ముందుకు సాగనుంది. లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించేవారికి భారీ జరిమానా విధించడంతో పాటు మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించేందుకు కూడా పోలీసులు వెనుకాడడం లేదు. సో… ఇంట్లో బోర్ కొడుతోంది కదా! అని అలా తిరిగొద్దామని బయటికి వెళ్లేందుకు ఓ సారి ఆలోచించండి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago