Political News

సెప్టెంబ‌రు నుంచి విశాఖ‌లోనే కాపురం: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌రు నుంచి తాను విశాఖ‌లోనే కాపురం పెట్ట‌బోతున్నా నని చెప్పారు. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు” అని జగన్‌ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే తాను ప‌రిపాల‌న చేస్తాన‌ని చెప్పారు. అక్క‌డే కాపురం ఉంటాన‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మూల‌పేట‌లో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని సీఎం చెప్పారు.

ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. టీడీపీ కొంద‌రితో క‌లిసి త‌న‌పై యుద్ధం చేస్తోంద‌ని తెలిపారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విశాఖ నుంచే పాల‌న సాగిస్తాన‌ని చెప్పారు. భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయన్నారు.

ఒక అబ‌ద్ధాన్ని ప‌దే ప‌దే చెబుతున్నార‌ని, వాళ్ల‌లా త‌న‌కు అబ‌ద్ధాలు చెప్పే అల‌వాటు లేద‌ని సీఎం చెప్పారు. తోడేళ్ల‌న్నీ ఏక‌మైనా త‌న‌కు భ‌యం లేద‌ని వ్యాఖ్యానించారు. “మీ ఇంట్లో మంచి జ‌రిగి ఉంటే.. మీ బిడ్డ‌గా న‌న్ను ఆశీర్వ‌దించండి. మీ బిడ్డ‌కు మీరే సైనికులుగా నిల‌వండి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన న‌గ‌రం విశాఖేన‌ని చెప్పారు.

This post was last modified on April 19, 2023 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago