Political News

సెప్టెంబ‌రు నుంచి విశాఖ‌లోనే కాపురం: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌రు నుంచి తాను విశాఖ‌లోనే కాపురం పెట్ట‌బోతున్నా నని చెప్పారు. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు” అని జగన్‌ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే తాను ప‌రిపాల‌న చేస్తాన‌ని చెప్పారు. అక్క‌డే కాపురం ఉంటాన‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మూల‌పేట‌లో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని సీఎం చెప్పారు.

ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. టీడీపీ కొంద‌రితో క‌లిసి త‌న‌పై యుద్ధం చేస్తోంద‌ని తెలిపారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విశాఖ నుంచే పాల‌న సాగిస్తాన‌ని చెప్పారు. భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయన్నారు.

ఒక అబ‌ద్ధాన్ని ప‌దే ప‌దే చెబుతున్నార‌ని, వాళ్ల‌లా త‌న‌కు అబ‌ద్ధాలు చెప్పే అల‌వాటు లేద‌ని సీఎం చెప్పారు. తోడేళ్ల‌న్నీ ఏక‌మైనా త‌న‌కు భ‌యం లేద‌ని వ్యాఖ్యానించారు. “మీ ఇంట్లో మంచి జ‌రిగి ఉంటే.. మీ బిడ్డ‌గా న‌న్ను ఆశీర్వ‌దించండి. మీ బిడ్డ‌కు మీరే సైనికులుగా నిల‌వండి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన న‌గ‌రం విశాఖేన‌ని చెప్పారు.

This post was last modified on April 19, 2023 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

16 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago