పార్టీలో యాక్టివ్ గా ఉండాలని.. దూకుడు ప్రదర్శించాలని.. వచ్చేఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే పార్టీ నేతలకు చెబుతున్నారు. ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశం.. తొలి పలుకు కూడా ఇదే. అయితే.. దీనిని ఎందరు అందిపుచ్చుకుంటున్నారు? ఎంత మంది బాబు చూపిన దారిలో ప్రయాణం చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. సుమారు 80 శాతం మంది టీడీపీ నాయకులు ఇప్పటికీ నిస్తేజంలో ఉన్నారు. అంటే.. వారు ప్రయత్నించడమే లేదు. అసలు కాలు కూడా బయటకు పెట్టడం లేదు. ఎన్నికలు వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలోనే ఉన్నారు. నిజానికి ఎన్నికలకు మరో 10 మాసాలు మాత్రమే సమయం ఉంది. అలాంట ప్పుడు.. వీరు ఎందుకు ఇంత నిస్తేజంలో ఉన్నారు? అంటే.. రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
1) అంతా చంద్రబాబు చూసుకుంటారు. 2) పొత్తులపై గందరగోళం. అయితే.. పొత్తుల విషయాన్ని పక్కన పెడితే.. తొలి విషయం మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. అంతా చంద్రబాబు, నారా లోకేష్ చూసుకుంటారు.. మా కెందుకు అనే ధోరణిని ప్రదర్శిస్తే.. వ్యక్తిగతంగా వారే నష్టపోయే ప్రమాదంతో పాటు పార్టీకి కూడా ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. టికెట్ వచ్చినా రాకున్నా.. ప్రజల్లో ఉంటే.. ఆ హవా వేరుగా ఉంటుందని చెబుతున్నారు.
కానీ, మెజారిటీ నాయకులు చంద్రబాబు వస్తే.. కనిపిస్తున్నారు.ఆయన అటు వెళ్లగానే వీరు తమ వ్యవహా రాల్లో మునిగిపోతున్నారు. ఫలితంగా వీరు చంద్రబాబు, నారా లోకేష్పై ఆధారపడిన పరాన్న జీవులా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, పొత్తుల విషయాన్ని చూస్తే.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి పొత్తులు లేకుండా కూడా వెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి ఇప్పటికైనా నాయకులు కదులుతారా? లేదా? చూడాలి.
This post was last modified on April 18, 2023 9:51 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…