Political News

మా ప్ర‌భుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారు: వైవీ

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సంచ‌లన వ్యాఖ్య లు చేశారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కూలిపోవాల‌ని… కొంద‌రు కోరుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రి కొంద‌రు కూల్చేయాల‌ని కూడా చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే ప్ర‌భుత్వంపై కొన్ని ప‌త్రిక‌లు , మీడియా సంస్థ‌లు ప‌నిగ‌ట్టుకుని క‌క్ష పూరిత రాత‌లు రాస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో మీడియాలో వైవీ మాట్లాడారు.

తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌రెడ్డిల‌ను సీబీఐ విచారించ‌డం, భాస్క‌రరెడ్డిని అరెస్టు చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో బెంగ‌ళూరుకు చెందిన లాబీయిస్టు, జ్యోతిష్యుడు కూడా అయిన విజ‌య‌కుమార్ రెండు రోజుల కింద‌ట హ‌ఠాత్తుగా(అదే రోజు అవినాష్ తండ్రిని సీబీఐ అరెస్టు చేసింది) మైసూరు నుంచి విమానంలో తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్‌ నివాసానికి వ‌చ్చారు. అయితే.. దీనిపై ప‌లు ప‌త్రిక‌ల్లో లాబీయింగ్ కోస‌మే ఆయ‌న వ‌చ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై తాజాగా వైవీ రియాక్ట్ అవుతూ.. 2007 నుంచి త‌న‌కు విజ‌య్‌కుమార్ తెలుసున‌న్నారు. ఆయ‌న‌.. వ‌చ్చింది లాబీయింగ్ చేసేందుకు కాద‌ని.. సీఎం జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించేందుకు మాత్ర‌మే వ‌చ్చార‌ని చెప్పారు. ఒక్క విజ‌య‌కుమారే కాకుండా.. అనేక మంది స్వాములు నిత్యం సీఎం జ‌గ‌న్‌ను క‌లుస్తుంటారని.. దీనిని లాబీయింగ్ అన‌డం స‌రికాద‌ని అన్నారు. విజ‌య‌కుమార్ చాలా సింపుల్‌గా ఉంటార‌ని చెప్పారు.

రామోజీరావు వియ్యంకుడు విశ్వేశ్వ‌ర‌రావు వ‌చ్చిన విమానంలోనే విజ‌య‌కుమార్ కూడా వ‌చ్చార‌ని చెప్పా రు. మార్గ‌ద‌ర్శి కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు విజ‌య‌కుమార్‌ను తెచ్చుకున్న‌దే రామోజీరావు అని ఎదురు దాడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీటీడీపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. స్వామీజీ విజ‌య‌కుమార్‌ ఆధ్వ‌ర్యంలో రామోజీ గృహ‌ప్ర‌వేశం జ‌ర‌గ‌లేదా? అని వైవీ నిల‌దీశారు.

This post was last modified on April 18, 2023 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

50 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago