Political News

వైసీపీకి ఓటేస్తామ‌ని దేవుడిపై ఒట్టు వేయించండి: ధ‌ర్మాన

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి, పొలిటిక‌ల్‌గా సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాదరావు.. ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. మ‌హిళ‌లుఎందుకు ఓటేయ‌ర‌ని.. ప‌థ‌కాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్న‌వారు ఓటు మాత్రం వేరే వారికి వేస్తారా? అని నిల‌దీసిన విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నం అయింది. ఇక ఈ ప‌రంప‌ర‌లో మంత్రి ధ‌ర్మాన మ‌రోసారి వివాదాస్ప‌ద ఆదేశాలు జారీ చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామ‌ని ఓట‌ర్ల‌తో దేవుడిపై ఒట్టు వేయించాల‌ని ఆయ‌న వ‌లంటీర్లు.. గృహ సార‌థుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ‘వైసీపీకి ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు మ‌న‌కే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని పటంపై వారితో ఒట్టు వేయించండి’ అని ధర్మాన ప్రసాదరావు వ‌లంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో వ‌లంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వ‌డం సంచ‌లనంగా మారింది.

‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. టీడీపీకి ఓటువేసే ఒక్క కుటుంబాన్నయినా వైసీపీ వైపు వ‌లంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.’ అని ధ‌ర్మాన దిశానిర్దేశం.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై ప్ర‌జ‌ల‌ను దెబ్బ కొట్టాల‌న్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలన్నారు. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలన్నారు. కులపెద్దలతో మాట్లాడించాల‌ని సూచించారు. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలని తేల్చి చెప్పారు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

28 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

1 hour ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

1 hour ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago