Political News

వైసీపీకి ఓటేస్తామ‌ని దేవుడిపై ఒట్టు వేయించండి: ధ‌ర్మాన

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి, పొలిటిక‌ల్‌గా సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాదరావు.. ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. మ‌హిళ‌లుఎందుకు ఓటేయ‌ర‌ని.. ప‌థ‌కాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్న‌వారు ఓటు మాత్రం వేరే వారికి వేస్తారా? అని నిల‌దీసిన విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నం అయింది. ఇక ఈ ప‌రంప‌ర‌లో మంత్రి ధ‌ర్మాన మ‌రోసారి వివాదాస్ప‌ద ఆదేశాలు జారీ చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామ‌ని ఓట‌ర్ల‌తో దేవుడిపై ఒట్టు వేయించాల‌ని ఆయ‌న వ‌లంటీర్లు.. గృహ సార‌థుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ‘వైసీపీకి ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు మ‌న‌కే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని పటంపై వారితో ఒట్టు వేయించండి’ అని ధర్మాన ప్రసాదరావు వ‌లంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో వ‌లంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వ‌డం సంచ‌లనంగా మారింది.

‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. టీడీపీకి ఓటువేసే ఒక్క కుటుంబాన్నయినా వైసీపీ వైపు వ‌లంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.’ అని ధ‌ర్మాన దిశానిర్దేశం.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై ప్ర‌జ‌ల‌ను దెబ్బ కొట్టాల‌న్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలన్నారు. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలన్నారు. కులపెద్దలతో మాట్లాడించాల‌ని సూచించారు. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలని తేల్చి చెప్పారు.

This post was last modified on April 18, 2023 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago