Political News

వైసీపీకి ఓటేస్తామ‌ని దేవుడిపై ఒట్టు వేయించండి: ధ‌ర్మాన

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి, పొలిటిక‌ల్‌గా సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాదరావు.. ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. మ‌హిళ‌లుఎందుకు ఓటేయ‌ర‌ని.. ప‌థ‌కాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్న‌వారు ఓటు మాత్రం వేరే వారికి వేస్తారా? అని నిల‌దీసిన విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నం అయింది. ఇక ఈ ప‌రంప‌ర‌లో మంత్రి ధ‌ర్మాన మ‌రోసారి వివాదాస్ప‌ద ఆదేశాలు జారీ చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామ‌ని ఓట‌ర్ల‌తో దేవుడిపై ఒట్టు వేయించాల‌ని ఆయ‌న వ‌లంటీర్లు.. గృహ సార‌థుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ‘వైసీపీకి ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు మ‌న‌కే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని పటంపై వారితో ఒట్టు వేయించండి’ అని ధర్మాన ప్రసాదరావు వ‌లంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో వ‌లంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వ‌డం సంచ‌లనంగా మారింది.

‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. టీడీపీకి ఓటువేసే ఒక్క కుటుంబాన్నయినా వైసీపీ వైపు వ‌లంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.’ అని ధ‌ర్మాన దిశానిర్దేశం.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై ప్ర‌జ‌ల‌ను దెబ్బ కొట్టాల‌న్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలన్నారు. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలన్నారు. కులపెద్దలతో మాట్లాడించాల‌ని సూచించారు. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలని తేల్చి చెప్పారు.

This post was last modified on April 18, 2023 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

51 minutes ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

1 hour ago

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

2 hours ago

‘పులిరాజు’ ఫోటో వెనుక అసలు కథ

ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…

2 hours ago

అరవింద్ మాటల్లో అర్థముందా అపార్థముందా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…

2 hours ago

బాలయ్యకు తిరుగు లేదు… ‘హిందూపురం’పై టీడీపీ జెండా

టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…

2 hours ago