టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఏదో ఒక పేరుతో ఆయన ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాలు నిర్ణయించుకున్నారు. అదేసమయంలో పార్టీ నేతలకు కూడా ఆయన హితోపదేశం చేస్తున్నారు. అయితే.. ఏ కార్యక్రమం నిర్వహించినా.. చంద్రబాబు వైఖరి, ఆయన శైలి మాత్రం మారడం లేదనేది పరిశీలకుల మాట. నిజానికి ఎక్కడికక్కడ ప్రజలు కోరుకునేది వారి సమస్యల పరిష్కారం. ఇదే పెద్ద ఎత్తున చర్చకు కూడా వస్తుంది.
అయితే, చంద్రబాబు స్టయిల్ మాత్రం మారడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కడకు వెళ్లినా..ఏం చేసినా జగన్పై విమర్శలు మాత్రమే చేస్తున్నారు. వైసీపీ నేతల కన్నా కూడా.. సీఎం జగన్ విషయాన్ని మాత్రమే హైలెట్ చేస్తున్నారు. దీనివల్ల.. గతంలో చంద్రబాబుకు ఉన్న పేరు ఇప్పుడు మరోసారి తెరమీదికి వస్తోంది. ఆయనకు మైకు దొరికితే వదిలి పెట్టరు.. అంటూ.. గతంలో ఒక టాక్ వినిపించేది.
దీనివల్ల చంద్రబాబు ప్రసంగాలు అప్పట్లో ప్రజల దృష్టికి వెళ్లలేదు. ఆయన ఏం చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇక, ప్రభుత్వం పడిపోయాక.. చంద్రబాబులో కొంత మార్పు అయితే కనిపించింది. కానీ, ఇటీవల కాలంలో మరోసారి వైసీపీని వ్యతిరేకించడమే పనిగా చంద్రబాబు ప్రసంగాలు దంచి కొడుతున్నారు. ఇది.. టీడీపీ అభిమానులకు, పార్టీ నాయకులకు వినసొంపుగా ఉన్నప్పటికీ.. సాధారణ ప్రజలకు మాత్రం బొరు కొడుతోందన్నది నిజం.
వైసీపీ అధినేత జగన్ విషయాన్ని తీసుకుంటే.. ఆయన ఇస్తున్న సొమ్ములు తీసుకుంటున్నవారు.. పథకాల లబ్ధి దారులు చాలా మంది ఉన్నారు. ఎంతలేదన్నా.. ఉప్పుతిన్నందున ఆయన పట్ల ప్రేమ, అభిమానం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు వైసీపీ ప్రభుత్వం చాలానే చేరువ అయింది.
ఇక, గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇంటికే ఫించన్లు ఇస్తున్నారు. ఇలా.. అనేక కార్యక్రమాలు.. మంచివే ఉన్నాయని ప్రజలు భావిస్తున్న సమయంలో అదే పనిగా సీఎం జగన్ను విమర్శించడం వల్ల చంద్రబాబుకు కలిసి వచ్చేది ఏమీలేదని అంటున్నారు పరిశీలకులు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…