వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదోసారి విచారణకు సీబీఐ పిలిచేసరికి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హడలిపోయినట్టుగా ఉన్నారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంచల న విషయాలు వెల్లడించారు. తాను అమాయకుడినని.. బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
అంతేకాదు.. చంద్రబాబు-సీబీఐ అదికారి కుమ్మక్కయ్యారని అవినాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడి గా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు. నాలుగు సంవత్సరాలలో అనేక పరిణామాల తర్వాత తనని లక్ష్యంగా చేశారని అవినాష్ ఆరోపించారు.
ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన అవినాష్.. పిటిషన్పై విచారణ తేలేవరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు
వివేకా తిరుగుబోతు!
దివంగత వివేకానంద రెడ్డి తిరుగుబోతు అని పిటిషన్లో ఎంపీఅవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేకాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. రెండో వివాహం ముస్లిం మహిళతో జరిగిందని.. ఆమెకు కొడుకు కూడా పుట్టాడని తెలిపారు. అదేసమయంలో వేరే మహిళతోనూ వివేకా సంబంధం పెట్టుకున్నాడని వారంతా కలిసి చంపి ఉంటారని అనుమానం ఉందని ఎంపీ తన పిటిషన్లో పేర్కొనడం గమనార్హం.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…