వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదోసారి విచారణకు సీబీఐ పిలిచేసరికి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హడలిపోయినట్టుగా ఉన్నారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంచల న విషయాలు వెల్లడించారు. తాను అమాయకుడినని.. బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
అంతేకాదు.. చంద్రబాబు-సీబీఐ అదికారి కుమ్మక్కయ్యారని అవినాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడి గా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు. నాలుగు సంవత్సరాలలో అనేక పరిణామాల తర్వాత తనని లక్ష్యంగా చేశారని అవినాష్ ఆరోపించారు.
ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన అవినాష్.. పిటిషన్పై విచారణ తేలేవరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు
వివేకా తిరుగుబోతు!
దివంగత వివేకానంద రెడ్డి తిరుగుబోతు అని పిటిషన్లో ఎంపీఅవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేకాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. రెండో వివాహం ముస్లిం మహిళతో జరిగిందని.. ఆమెకు కొడుకు కూడా పుట్టాడని తెలిపారు. అదేసమయంలో వేరే మహిళతోనూ వివేకా సంబంధం పెట్టుకున్నాడని వారంతా కలిసి చంపి ఉంటారని అనుమానం ఉందని ఎంపీ తన పిటిషన్లో పేర్కొనడం గమనార్హం.
This post was last modified on April 17, 2023 4:31 pm
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…