Political News

గన్నవరం వచ్చిన స్పెషల్ ఫ్లైట్ లో ఎవరున్నారు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కావటం తెలిసిందే. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ అరెస్టు గురించి ఏ మాత్రం సమాచారం లేకుండా గుట్టుగా సాగినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అరెస్టు అనంతరం కొన్ని గంటల వ్యవధిలో గన్నవరం ఎయిర్ పోర్టుకు మైసూర్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ ఫ్లైట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ స్పెషల్ ఫ్లైట్ నుంచి వచ్చిన ముఖ్యులు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన వారు సీఎం జగన్ తో సుదీర్ఘంగా ఎందుకు మంతనాలు జరిపినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిందెవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. ఆసక్తికర సమాధానాలు లభిస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేర్కొనే పారిశ్రామికవేత్త.. కృష్ణపట్నం పోర్టు ఎండీ గా పనిచేసిన చింతా శశిధర్‌ హుటాహుటిన మైసూర్ వెళ్లి.. కర్ణాటకలో జ్యోతిష్యుడిగా..లాబీ మాస్టర్ గా పేరున్న విజయ్ కుమార్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి వచ్చిన వారు.. సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మొత్తం ముగ్గురు ప్రత్యేక విమానంలో వచ్చినట్లుగా తెలుస్తోంది.

జ్యోతిషుడిగా పేరున్న విజయ్ కుమార్ కు రాజకీయ.. న్యాయ ప్రముఖులతో మంచి రిలేషన్లు ఉన్నాయని.. లాబీ మాస్టర్ గా మంచి పేరుందని చెబుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన విషయాల మీదనే వీరి మధ్య చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ తో సుదీర్ఘ సమావేశం ముగిసిన తర్వాత.. విజయకుమార్.. చింతా శశిధర్ మరో సహాయకుడు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జ్యోతిషుడైన విజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ బాగా పెద్దదని చెబుతున్నారు. జ్యోతిషం.. పూజల పేరుతో రాజకీయ నేతలు.. న్యాయవ్యవస్థలోని పలువురు ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. తెర వెనుక విషయాల్ని చక్కబెట్టే విషయంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతారు.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు సుప్రీంకోర్టులో అనేక మంది ప్రముఖులతో ఆయనకు జ్యోతిష.. పూజల సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇతర న్యాయప్రముఖులు తిరుమల.. శ్రీశైలం సందర్శించిన వేళలో వారి వెంట విజయకుమార్ ఉన్నారని.. అదీ ఆయన రేంజ్ అంటున్నారు.

This post was last modified on April 17, 2023 12:43 pm

Share

Recent Posts

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

29 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

1 hour ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

1 hour ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

4 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

4 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

4 hours ago