వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో నిన్నటి వరకు సీబీఐ అధికారులు సాక్షిగా పేర్కొన్న కడప ఎంపీ.. అవినాష్ రెడ్డిని తాజాగా సహ నిందితుడిగా పేర్కొంటూ.. కోర్టుకు సమర్పించే చార్జిషీట్లో సంచలన మా ర్పులు చేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో టెన్షన్ పూరిత వాతావరణం పెరిగిపోయింది. ఇదిలావుంటే.. ఈ మార్పులు చేసిన రోజే అంటే.. సోమవారమే.. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం మరింతగా ఉత్కంఠను పెంచేసింది.
ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్ను సీబీఐ విచారించింది. ఇక, ఇప్పుడు ఐదోసారి ఆయనను కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా హైదరాబాద్ వెళ్లారు.
ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విచారణల మాదిరిగా ఇది ఉంటే.. వైసీపీలో పెద్ద సమస్య టెన్షన్ ఉండేదికాదు. కానీ, పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా గజ్జల ఉదయ్కుమార్రెడ్డి అరెస్టు విచారణ తర్వాతే పరిస్థితి యూటర్న్ తీసుకుంది.
ఈ క్రమంలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, అనంతరం.. ఆయనను జైలుకు తరలించడం జరిగాయి. ఇక, ఇప్పుడు అవినాష్ను సాక్షి నుంచి సహనిందితుడిగా మార్చడం.. ఆ వెంటనే విచారణకు పిలవడం.. వంటివి మధ్యాహ్నం 3 తర్వాత ఏమైనా జరగొచ్చు..అ నే చర్చకు తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఒకవైపు ఉత్కంఠ , మరోవైపు చర్చల్లో మునిగిపోయారు.
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…