Political News

నిన్న సాక్షి.. నేడు నిందితుడు.. ఎంపీ అవినాష్‌కు బిగిస్తున్న ఉచ్చు!

వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో నిన్నటి వ‌ర‌కు సీబీఐ అధికారులు సాక్షిగా పేర్కొన్న క‌డ‌ప ఎంపీ.. అవినాష్ రెడ్డిని తాజాగా స‌హ నిందితుడిగా పేర్కొంటూ.. కోర్టుకు స‌మ‌ర్పించే చార్జిషీట్‌లో సంచ‌ల‌న మా ర్పులు చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో టెన్ష‌న్ పూరిత వాతావ‌ర‌ణం పెరిగిపోయింది. ఇదిలావుంటే.. ఈ మార్పులు చేసిన రోజే అంటే.. సోమ‌వారమే.. ఎంపీ అవినాష్ రెడ్డిని విచార‌ణ‌కు పిల‌వ‌డం మ‌రింతగా ఉత్కంఠ‌ను పెంచేసింది.

ఇప్ప‌టికే నాలుగు సార్లు అవినాష్‌ను సీబీఐ విచారించింది. ఇక‌, ఇప్పుడు ఐదోసారి ఆయ‌న‌ను కోఠిలోని సీబీఐ కార్యాల‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించింది. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమ‌వారం తెల్లవారుజామున పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా హైదరాబాద్ వెళ్లారు.

ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సోమ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు విచార‌ణ‌ల మాదిరిగా ఇది ఉంటే.. వైసీపీలో పెద్ద స‌మ‌స్య టెన్ష‌న్ ఉండేదికాదు. కానీ, ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డి అరెస్టు విచార‌ణ త‌ర్వాతే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

ఈ క్ర‌మంలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని అరెస్టు చేయ‌డం, అనంత‌రం.. ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించ‌డం జ‌రిగాయి. ఇక‌, ఇప్పుడు అవినాష్‌ను సాక్షి నుంచి స‌హ‌నిందితుడిగా మార్చ‌డం.. ఆ వెంట‌నే విచార‌ణ‌కు పిలవ‌డం.. వంటివి మ‌ధ్యాహ్నం 3 త‌ర్వాత ఏమైనా జ‌ర‌గొచ్చు..అ నే చ‌ర్చకు తెర‌దీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఒక‌వైపు ఉత్కంఠ , మ‌రోవైపు చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

14 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago