తెలుగు రాష్ట్రాలను తీవ్రస్థాయిలో కుదిపేసిన ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్లోని చంచలగూడ జైలుకు తరలించారు. దీనికి ముందు భాస్కరరెడ్డిని నాంపల్లిలోని సీబీఐ మేజిస్ట్రేట్ కోర్టుకు అధికారులు తరలించారు. అయితే.. ఆదివారం కావడంతో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
తొలుత ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అనంతరం రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే.. భాస్కరరెడ్డిని విచారించాల్సి ఉందని తమ కస్టడీ ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. కానీ, దీనికి ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి పేర్కొనడంతో సీబీఐ సోమవారం పిటిషన్ వేసేందుకు అంగీకరించింది. మరోవైపు భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది నాగార్జున రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుంటే, పులివెందులలో అరెస్టు అనంతరం.. భాస్కరరెడ్డిని హైదరాబాద్కు తరలించిన సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
ఈ సమయంలో వైఎస్ భాస్కర్రెడ్డికి రక్తపోటు పెరిగింది. బీపీ 170గా ఉండటంతో వైద్య పరీక్షలు ముమ్మరం చేవారు. భాస్కర్ రెడ్డికి సెలైన్ ఎక్కించి చికిత్స అందించారు. మరోవైపు టుడి ఎకో పరీక్ష కూడా చేసినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. మెడికల్ రిపోర్టును సీబీఐ అధికారులు మేజిస్ట్రేట్ కు అందించారు. అనంతరం భాస్కరరెడ్డిని 14 రోజుల రిమాండ్కు తరలిస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
This post was last modified on April 17, 2023 6:04 am
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…