తెలుగు రాష్ట్రాలను తీవ్రస్థాయిలో కుదిపేసిన ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్లోని చంచలగూడ జైలుకు తరలించారు. దీనికి ముందు భాస్కరరెడ్డిని నాంపల్లిలోని సీబీఐ మేజిస్ట్రేట్ కోర్టుకు అధికారులు తరలించారు. అయితే.. ఆదివారం కావడంతో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
తొలుత ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అనంతరం రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే.. భాస్కరరెడ్డిని విచారించాల్సి ఉందని తమ కస్టడీ ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. కానీ, దీనికి ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి పేర్కొనడంతో సీబీఐ సోమవారం పిటిషన్ వేసేందుకు అంగీకరించింది. మరోవైపు భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది నాగార్జున రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుంటే, పులివెందులలో అరెస్టు అనంతరం.. భాస్కరరెడ్డిని హైదరాబాద్కు తరలించిన సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
ఈ సమయంలో వైఎస్ భాస్కర్రెడ్డికి రక్తపోటు పెరిగింది. బీపీ 170గా ఉండటంతో వైద్య పరీక్షలు ముమ్మరం చేవారు. భాస్కర్ రెడ్డికి సెలైన్ ఎక్కించి చికిత్స అందించారు. మరోవైపు టుడి ఎకో పరీక్ష కూడా చేసినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. మెడికల్ రిపోర్టును సీబీఐ అధికారులు మేజిస్ట్రేట్ కు అందించారు. అనంతరం భాస్కరరెడ్డిని 14 రోజుల రిమాండ్కు తరలిస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
This post was last modified on April 17, 2023 6:04 am
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…