ఉత్తరప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. ఎన్ కౌంటర్లో కొడుకు చనిపోయిన మూడురోజులకే తండ్రి, తండ్రితో పాటు బాబాయ్ కూడా హత్యకు గురవ్వటం యూపీలో సంచలనంగా మారింది. అతీక్ సుమారు 100కు పైగా కేసుల్లో నిందితుడు. పదులసంఖ్యలో కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మామూలుగా అయితే ఈ కేసుల విచారణ ఎప్పటికీ పూర్తికావని అందరికీ తెలిసిందే.
ఒక్కో కేసు విచారణకే సంవత్సరాలు పడుతుంటే ఇక వంద కేసుల విచారణ ఎప్పటికి పూర్తవ్వాలి ? ఎప్పటికి కోర్టులు తీర్పివ్వాలి. విషయం ఏమిటంటే ఓ కేసులో జైలులో ఉన్న అతీక్ ను పోలీసులు ప్రయాగ్ రాజ్ లోని కోర్టులో మూడురోజుల క్రితమే హాజరుపరచాల్సుంది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు అసద్ తన ముఠాతో ప్లాన్ చేశాడు. తండ్రిని ఎలాగైనా పోలీసుల నుండి తప్పించాలని అనుకుని కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో అసద్ ఎన్ కౌంటరైపోయాడు.
సరే మూడురోజుల తర్వాత అంటే శనివారం పోలీసులు అతీక్ ను మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్ధులు దారికాచి పోలీసులపై ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడిలో అతీక్ తో పాటు తమ్ముడు అఫ్రష్ అహ్మద్ కూడా చనిపోయాడు. అతీక్ ప్రత్యర్ధుల దాడిలో పోలీసులకు కూడా గాయలయ్యాయి. మొత్తంమీద మూడురోజుల వ్యవధిలోనే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, కొడుకు అసద్ మరణించటం యూపీలో సంచలనంగా మారింది.
మరణాల వెనుక కారణాలు ఏమైనా జనాలంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అతీక్ మీద 100కు పైగా కేసులున్నాయంటేనే తన వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్నిరకాలుగా నష్టపోయాయో అర్ధంచేసుకోవాలి. తమను అంతగా ఇబ్బందులుపెట్టిన అతీక్, అసద్ మరణించారంటే బాధిత కుటుంబాలు సంతోషంగా పండగ చేసుకోకుండా ఎలాగుంటాయి. ఇలాంటి లోకకంఠకులకు అండదండలు అందించిన అందిస్తున్న రాజకీయపార్టీలదే అసలు తప్పు. లేకపోతే ఇంతటి క్రూరమైన గ్యాంగ్ స్టర్ ఎంపీగా ఎలా గెలిచాడు ? జనాలు ఎలా ఓట్లేశారు ?
This post was last modified on April 16, 2023 9:53 am
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…