Political News

గ్యాంగ్ స్టర్ హత్య..పండగ చేసుకుంటున్న జనాలు

ఉత్తరప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. ఎన్ కౌంటర్లో కొడుకు చనిపోయిన మూడురోజులకే తండ్రి, తండ్రితో పాటు బాబాయ్ కూడా హత్యకు గురవ్వటం యూపీలో సంచలనంగా మారింది. అతీక్ సుమారు 100కు పైగా కేసుల్లో నిందితుడు. పదులసంఖ్యలో కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మామూలుగా అయితే ఈ కేసుల విచారణ ఎప్పటికీ పూర్తికావని అందరికీ తెలిసిందే.

ఒక్కో కేసు విచారణకే సంవత్సరాలు పడుతుంటే ఇక వంద కేసుల విచారణ ఎప్పటికి పూర్తవ్వాలి ? ఎప్పటికి కోర్టులు తీర్పివ్వాలి. విషయం ఏమిటంటే ఓ కేసులో జైలులో ఉన్న అతీక్ ను పోలీసులు ప్రయాగ్ రాజ్ లోని కోర్టులో మూడురోజుల క్రితమే హాజరుపరచాల్సుంది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు అసద్ తన ముఠాతో ప్లాన్ చేశాడు. తండ్రిని ఎలాగైనా పోలీసుల నుండి తప్పించాలని అనుకుని కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో అసద్ ఎన్ కౌంటరైపోయాడు.

సరే మూడురోజుల తర్వాత అంటే శనివారం పోలీసులు అతీక్ ను మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్ధులు దారికాచి పోలీసులపై ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడిలో అతీక్ తో పాటు తమ్ముడు అఫ్రష్ అహ్మద్ కూడా చనిపోయాడు. అతీక్ ప్రత్యర్ధుల దాడిలో పోలీసులకు కూడా గాయలయ్యాయి. మొత్తంమీద మూడురోజుల వ్యవధిలోనే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, కొడుకు అసద్ మరణించటం యూపీలో సంచలనంగా మారింది.

మరణాల వెనుక కారణాలు ఏమైనా జనాలంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అతీక్ మీద 100కు పైగా కేసులున్నాయంటేనే తన వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్నిరకాలుగా నష్టపోయాయో అర్ధంచేసుకోవాలి. తమను అంతగా ఇబ్బందులుపెట్టిన అతీక్, అసద్ మరణించారంటే బాధిత కుటుంబాలు సంతోషంగా పండగ చేసుకోకుండా ఎలాగుంటాయి. ఇలాంటి లోకకంఠకులకు అండదండలు అందించిన అందిస్తున్న రాజకీయపార్టీలదే అసలు తప్పు. లేకపోతే ఇంతటి క్రూరమైన గ్యాంగ్ స్టర్ ఎంపీగా ఎలా గెలిచాడు ? జనాలు ఎలా ఓట్లేశారు ?

This post was last modified on April 16, 2023 9:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago