జారుడు బల్లలపై వైసీపీ నేతల విన్యాసాలు ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటనేది తెలుసు కోకుండానే నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకి..వ్యక్తిగతంగా నేతలకు కూడా ఇబ్బందిగానే మారు తోందని అంటున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం, విజయవాడ సెంట్రల్, పాణ్యం, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, కొవ్వూరు ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తుల పరంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
నిజానికి పార్టీపరంగా వ్యతిరేకత ఉంటే.. అది వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ద్వారా పోగొట్టుకుని.. పార్టీపరంగా బలోపేతం కావాలనేది సీఎం జగన్ సహా వైసీపీ కీలక నాయకుల ఆలోచన. ఒకవేళ.. వ్యక్తిగతంగా ఏదైనా తేడా వస్తోందని తెలిస్తే..పార్టీపరంగా బలోపేతం కావాలనేది కూడా వ్యూహమే. ఈ రెండింటిలో సమయానికి, పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాల్సిన నాయకులు.. ఇప్పుడు ఇక్కడే ట్రాక్ తప్పుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఉదాహరణకు నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్కు వ్యక్తిగతంగా పరిస్థితి చాలా బ్యాడ్గా ఉందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ జోరు.. అయ్యన్న ఊపు వెరసి.. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు మైనస్లు పడుతున్నాయి. దీనినిసరిచేసుకునే ప్రయత్నాలు సదరు ఎమ్మెల్యే చేయడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ లోనూఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరీముఖ్యంగా కర్నూలులో సగం నియోజకవర్గాలు.. నేతల చేజారి పోతున్నాయనే టాక్ కొన్నాళ్లుగా విని పిస్తోంది. దీనికి కారణం.. నేతల వ్యక్తిగత వ్యవహార శైలేనన్నది.. పరిశీలకుల మాట. మరి ఇలాంటి పరిస్థి తిని అధిగమించి.. పార్టీ తరఫున అయినా.. తమ గ్రాఫ్ పెంచుకోవాలనే ధ్యాస నాయకుల్లో కనిపించకపో వడం గమనార్హం. అంతేకాదు.. కనీసం గడపగడపకు కానీ.. ఇతర కార్యక్రమాలను కానీ.. మనసు పెట్టి చేయకపోవడం.. అంతా సీఎం జగన్ చూసుకుంటారని భావిస్తుండడం వంటివి మరింతగా వీరి గ్రాఫ్ను దిగజారుస్తుండడం గమనార్హం.
This post was last modified on April 15, 2023 6:12 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…