Political News

వైసీపీకి మ‌రో ఉచ్చు.. ప‌దునెక్కిన ‘కోడిక‌త్తి’!!

ఏపీలో మ‌రో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీకి ఒక‌దానిపై ఒక‌టి ఉచ్చులు పెరుగుతున్నాయి. ఒక‌వైపు.. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు క‌త్తి వైసీ పీపై వేలాడుతూనే ఉంది. దీనిని గ‌త ఎన్నిక‌ల్లో సింప‌తీకి వాడుకున్నారు. చంద్ర‌బాబే చంపించార‌ని పెద్ద ఎత్తున యాగీ చేశారు. మొత్తానికి ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందారనే వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తూనే ఉంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో కేసు.. సీఎం జ‌గ‌న్‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. అదే.. 2018లో విశాఖ‌లో జ‌రిగిన కోడిక‌త్తి కేసు. దీనిని కూడా అప్ప‌ట్లో జ‌గ‌న్ అండ్ కోలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య త్నం చేసి స‌క్సెస్ అయ్యార‌ని టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కేసులోనే వైసీపీ అడ్డంగా ఇరుక్కుపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఈ కేసులో ఎన్ ఐఏ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌ను ప‌రిశీలిస్తే..అనేక ప్ర‌శ్న‌లు జ‌గ‌న్ చుట్టూ.. వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి.

జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే దాడి చేశానని, ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని నిందితుడు శ్రీనివాసరావు తన వాంగ్మూలంలో చెప్పాడు. అయినా.. ఆయనంతట ఆయనే దాడి చేశాడా..? అనేది ప్ర‌శ్న‌. ప‌ట్టు మ‌ని పాతికేళ్లు కూడా లేకుండానే అంత పెద్ద ప్లాన్‌ ఎలా వేశాడ‌న్న‌ది.. చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం. ఈ క్ర‌మంలోనే ఏదైనా శక్తులు, వ్యక్తుల ప్రోద్బలం ఏమైనా ఈ దాడి వెనుక ఉందా..? అనేది కీల‌కంగా మారింది.

జ‌గ‌న్ గాయానికి చికిత్స చేసిన హైద‌రాబాద్‌లోని సిటీన్యూరో సెంటర్ డాక్టర్‌ సాంబశివారెడ్డిని వైసీపీ అధికారంలోకి రాగానే.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా, ఆ తర్వాత ఆరోగ్య శ్రీ ట్రస్టు వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు. మ‌రి ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

నాటి ఘ‌ట‌న త‌ర్వాత‌.. నిందితుడు శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలో రేషన్‌ దుకాణాల్లో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, పింఛన్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని రాశారు. వారికి ఇంటికే పింఛను, రేష‌న్ ఇస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. చిత్రంగా..ఇప్పుడు వైసీపీ హ‌యాంలో అవే జ‌రుగుతున్నాయి. మ‌రి.. ఆ లేఖ‌కు, ప్ర‌స్తుత పాల‌న‌కు అవినాభావ సంబంధం ఉందా? అనేది ఇంట్ర‌స్టింగ్. ఏదేమైనా ఇలా అనేక ప్ర‌శ్న‌లు ఇప్పుడు వైసీపీ వైపే వేళ్లు చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 15, 2023 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

2 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

3 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

4 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago