Political News

ఎన్నికల ముందు బీజేపీకి షాక్

సరిగ్గా ఎన్నికల ముందు రిజర్వేషన్ల అమలు విషయంలో కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. లింగాయతులు, ఒక్కలిగలకు బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని పక్కనపెట్టేసింది. కర్నాటకలో ఓబీసీ ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దుచేసింది. అలా రద్దుచేయగా మిగిలిపోయిన 4 శాతం రిజర్వేషన్లో 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం ఒక్కలిగలకు సర్దుబాటుచేసింది. బొమ్మై ప్రభుత్వం చేసిన ఈ చర్య పూర్తిగా రాజకీయలబ్ది కోసమే అని అందరికీ తెలుసు.

ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనే లింగాయతులు, ఒక్కలిగలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచేసింది. దానిపై కోర్టులో ఎవరో సవాలు చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది. ఏ ఆధారంతో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేశారని నిలదీసింది. ఒక్కలిగలు, లింగాయతలకు రిజర్వేషన్ల శాతం ఏ ప్రాతిపదికన పెంచారన్న సుప్రింకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.

దాంతో పై సామాజికవర్గాలకు పెంచిన రిజర్వేషన్లను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ లాయర్ హామీ ఇచ్చారు. నియామకాలు, అడ్మిషన్లలో లింగాయతులు, ఒక్కలిగలకు పెంచిన 2 శాతం రిజర్వేషన్లను నిలిపేస్తామని లాయర్ చెప్పారు. దాంతో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లే. ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో ఒక్కలిగలు, లింగాయతుల ఓట్లే కీలకం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వీళ్ళ మద్దతుంటే మాత్రమే రాగలదు. సమాజంలో అతిపెద్ద సామాజికవర్గం లింగాయతులైతే వీళ్ళ తర్వాత సామాజికవర్గం ఒక్కలిగలు.

ఒక్కలిగల శాతం 15 శాతముందంటే లింగాయతులు అంతకన్నా ఎక్కువే ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మద్దతు కోసమే బీజేపీ ప్రభుత్వం హడావుడి ముస్లిం రిజర్వేషన్ రద్దుచేసి పై రెండు సామాజికవర్గాలకు కలిపింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేది అనుమానమే అంటున్నారు. అధికారంలోకి రాకపోతే బీజేపీకి చాలా ఇబ్బందవుతుంది. అందుకనే అధికారంలోకి రావటానికి అందుబాటులో ఉన్న ప్రతిమార్గాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగమే ఒక్కలిగలు, లింగాయతులకు రిజర్వేషన్ పెంచటం. దాన్ని సుప్రింకోర్టు అడ్డుకున్నది. మరి ఎన్నికల్లో దీన్ని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.

This post was last modified on April 15, 2023 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

35 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

50 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago