అంబటి రాంబాబు నీటి పారుదల శాఖామంత్రి… ప్రత్యేర్థులు ఆయన్ను నోటి పారుదల శాఖామంత్రి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడతారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులను తిట్టి పోస్తుంటారు. అలాంటి ఫోర్సున్న అంబటి.. ఇప్పుడు ఎందుకో వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారని అనుచురులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు..
సత్తెనపల్లి వైసీపీ టికెట్ తనకు గ్యారెంటీ కాదని అంబటి స్వయంగా చెప్పుకుంటున్నారట. ఈ దిశగా ఆయన నిర్వేదంలోకి వెళ్లిపోయారట. 2024లో తామెవ్వరికీ టికెట్ గ్యారెంటీ లేదని అంబటి చెప్పుకుంటున్నారట. అదేమంటే అది అంతేనని అంటున్నారట.
2014లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయిన అంబటి 2019లో గెలిచారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కీలక జలవనసరు ల శాఖ దక్కింది. 2024లో టికెట్ ఉండదన్న షరతు మీదే అంబటికి మంత్రి పదవి ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు నర్మగర్భంగా అంబటి అదే విషయాన్ని అనుచరులు, అభిమానుల వద్ద చెప్పుకుంటున్నారని వైసీపీ జనం అంటున్నారు.
టికెట్ రాదని తెలిసినా అధిష్టానం ఆదేశాల మేరకు గడప గడపకు తిరుగుతున్నామని అంబటి చెబుతున్నారు. అయితే తాజాగా నిర్వహిస్తున్న పీపుల్స్ సర్వేలో అంబటి ఆసక్తిగా పాల్గొనడం లేదని నియోజకవర్గంలో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.పనంతా కింది స్థాయి కేడర్ కు, వాలంటీర్లకు అప్పగించి ఆయన మౌనం వహిస్తున్నారని అంటున్నారు. అంబటి మీ వీధికి వస్తున్నారని ముందుగా పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. దానితో మంత్రిని చూసేందుకు జనం వేచి ఉంటున్నారు. అయితే అంబటి రాకుండానే ఓ పది మంది గుంపుగా వచ్చి సర్వే పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. దానితో రాజకీయాల పట్ల అంబటికి ఇంట్రస్ట్ తగ్గిందని గుస గుసలు వినిపిస్తున్నాయి….
This post was last modified on April 14, 2023 10:48 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…