Political News

పవన్ మాటలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి


ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తుండటంపై వివాదం నెలకొన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత రైతులను కలిసేందుకు వెళ్లారు. అప్పుడు భూములిస్తున్న రైతులకు భరోసా ఏంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారాయన.

తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన మద్దతుదారే అయినప్పటికీ భూసేకరణ విషయంలో తప్పులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి రైతుల గోడు వింటూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు భూసేకరణ విషయంలో పవన్ అనవసర రాద్దాంతం చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్లు విమర్శలు చేశారు. కొందరు రైతుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆ రోజు పవన్ ఎంత ముందు చూపుతో మాట్లాడాడు అన్నది ఈ రోజు నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.

ఇంతకీ 2015 ఆగస్టు 23న అమరావతిలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ పవన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.
‘‘అనేక వేలమంది రైతులు వాళ్ల నమ్మకాన్ని, వాళ్ల భవిష్యత్తుని, వారి పిల్లలు, తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని నమ్మి అమరావతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే.. కీడెంచి మేలెంచమంటాం కదా.. కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే.. మంత్రి నారాయణ గారుండరు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారుండరు. భూములు ఇచ్చిన రైతులకు గ్యారెంటీ ఏంటి? భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసేందుకు రాజ్యాంగపరమైన భద్రత ఏముంటుంది?

నేనొక సినిమా తీసేటపుడు దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టే అందరికీ జవాబుదారీగా ఉండాలి. నా సినిమా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఇంటిదగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత డబ్బు పెట్టాం ఏం చేశావ్ అని.. ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉన్నపుడు.. ప్రభుత్వం ఇన్నివేల ఎకరాల భూముల్ని సేకరిస్తున్నపుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఆ బాధ్యతను మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? శాసనాల ద్వారా ఇస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది’’ అన్నాడు పవన్ ఆ రోజు. పవన్ ఏం ఆందోళన వ్యక్తం చేశాడో అదే ఇప్పుడు జరుగుతోంది. దీనిపై ఇటు టీడీపీ.. అటు వైసీపీ ఏమంటాయో?

This post was last modified on August 3, 2020 8:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago