కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. బీజేపీతో అంతా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఆయన చేరిక విషయమై దిల్లీ పెద్దలతో ఈటల రాజేందర్, బండి సంజయ్ చర్చిస్తున్నారని చెప్తున్నారు.
మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుండడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితది. ఆయన కూడా అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.
మహేశ్వర్ రెడ్డి ఒకట్రెండ రోజుల్లొ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవనున్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే, ఆయన బీజీపీ నేతలను కలవడానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు వీలైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో చేరికల వ్యవహారం చూస్తున్న ఈటెల రాజేందర్తో మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికీ మహేశ్వర్ రెడ్డి మిత్రుడే. బండి సంజయ్తో గొప్ప సంబంధాలు లేకపోయినా ఎలాంటి విభేధాలు లేవు. కాగా ఈటల, బండి ఇప్పటికే ఢిల్లీ వెళ్లడంతో మహేశ్వర్ రెడ్డి విషయంలోనే వారు దిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…