Political News

మహేశ్వర్ రెడ్డి.. దారులన్నీ బీజేపీ వైపే

కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. బీజేపీతో అంతా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఆయన చేరిక విషయమై దిల్లీ పెద్దలతో ఈటల రాజేందర్, బండి సంజయ్ చర్చిస్తున్నారని చెప్తున్నారు.

మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుండడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితది. ఆయన కూడా అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.

మహేశ్వర్ రెడ్డి ఒకట్రెండ రోజుల్లొ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవనున్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే, ఆయన బీజీపీ నేతలను కలవడానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు వీలైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో చేరికల వ్యవహారం చూస్తున్న ఈటెల రాజేందర్‌తో మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికీ మహేశ్వర్ రెడ్డి మిత్రుడే. బండి సంజయ్‌తో గొప్ప సంబంధాలు లేకపోయినా ఎలాంటి విభేధాలు లేవు. కాగా ఈటల, బండి ఇప్పటికే ఢిల్లీ వెళ్లడంతో మహేశ్వర్ రెడ్డి విషయంలోనే వారు దిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.

This post was last modified on April 13, 2023 4:12 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

1 minute ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago