Political News

మహేశ్వర్ రెడ్డి.. దారులన్నీ బీజేపీ వైపే

కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. బీజేపీతో అంతా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఆయన చేరిక విషయమై దిల్లీ పెద్దలతో ఈటల రాజేందర్, బండి సంజయ్ చర్చిస్తున్నారని చెప్తున్నారు.

మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుండడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితది. ఆయన కూడా అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.

మహేశ్వర్ రెడ్డి ఒకట్రెండ రోజుల్లొ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవనున్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే, ఆయన బీజీపీ నేతలను కలవడానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు వీలైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో చేరికల వ్యవహారం చూస్తున్న ఈటెల రాజేందర్‌తో మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికీ మహేశ్వర్ రెడ్డి మిత్రుడే. బండి సంజయ్‌తో గొప్ప సంబంధాలు లేకపోయినా ఎలాంటి విభేధాలు లేవు. కాగా ఈటల, బండి ఇప్పటికే ఢిల్లీ వెళ్లడంతో మహేశ్వర్ రెడ్డి విషయంలోనే వారు దిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.

This post was last modified on April 13, 2023 4:12 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

8 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

8 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

12 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

13 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

13 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

13 hours ago