Political News

మహేశ్వర్ రెడ్డి.. దారులన్నీ బీజేపీ వైపే

కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. బీజేపీతో అంతా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఆయన చేరిక విషయమై దిల్లీ పెద్దలతో ఈటల రాజేందర్, బండి సంజయ్ చర్చిస్తున్నారని చెప్తున్నారు.

మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుండడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితది. ఆయన కూడా అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.

మహేశ్వర్ రెడ్డి ఒకట్రెండ రోజుల్లొ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవనున్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే, ఆయన బీజీపీ నేతలను కలవడానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు వీలైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో చేరికల వ్యవహారం చూస్తున్న ఈటెల రాజేందర్‌తో మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికీ మహేశ్వర్ రెడ్డి మిత్రుడే. బండి సంజయ్‌తో గొప్ప సంబంధాలు లేకపోయినా ఎలాంటి విభేధాలు లేవు. కాగా ఈటల, బండి ఇప్పటికే ఢిల్లీ వెళ్లడంతో మహేశ్వర్ రెడ్డి విషయంలోనే వారు దిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది.

This post was last modified on April 13, 2023 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago