ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘మీ మామతో కలిసి కల్లు తాగి.. ఒళ్లు కొవ్వెక్కిందా?’ అని ప్రశ్నించారు. అంతేకాదు.. కవితకు ఉన్నట్టు.. ఏపీలో ఎవరికీ లిక్కర్ మాఫియాలతో సంబంధం లేదన్నారు. విషయం ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు.. కేంద్రం రెడీ అయిన దరిమిలా.. దీనిని సొంతం చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు.
దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
“హరీష్ రావు కూడా.. తన మామ కేసీఆర్తో కలిసి ఫాం హౌస్లో కూర్చుని కల్లు తాగాడా? అని అనిపించింది నాకు. కల్లు తాగిన కోతిలాగా.. ఒళ్లు కొవ్వెక్కి.. హరీష్ రావు మాట్టాడాతా ఉన్నాడు. మీ మామ లాగా..ఫామ్ హౌస్ లో కూర్చుని కల్లు తాగడం లేదిక్కడ. లేకపోతే.. పాపం కవితక్కలాగా… అలాంటి చాట్ లు కూడా లేవు మా దగ్గర. లిక్కర్ స్కామ్లు కూడా లేవు. మాట్లాడే ముందు .. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హరిష్ రావును కొరుతున్నా” అని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ ఉగ్రవాదులు
“సిగ్గు ఎగ్గు లేకుండా.. విశాఖను ప్రైవేటీకరిస్తే.. బిడ్ వేస్తామని చెబుతున్నావ్. మీరు అసలు ప్రైవేటీకరణకు అనుకూలమా.. వ్యతిరేకమా.. ” అని నిలదీశారు. ఇక, బంగారు తెలంగాణ అంటూ.. సాధించారు కదా.. కానీ, దొరల పాలన తీసుకువచ్చారని విమర్శించారు. “నువ్వు మంత్రివి, నీ మామగారు ముఖ్యమంత్రి.. ఆయనకో కొడుకు ఆయనో మంత్రి.. తెలంగాణ మీ జాగీరా? మీరు ప్రాంతీయ ఉగ్రవాదులు.. నువ్వు.. మీ మావ..మీ మామ కొడుకు, మీ మామ కూతురు అందరూ ప్రాతీయ ఉగ్రవాదులు. పనికిమాలిన మాటలు ఆపి.. మీ పని మీరు చేసుకోండి. మా ఆంధ్రా వాళ్లు తెలంగాణ రావడం ఆపేస్తే.. అక్కడ తినేందుకు కూడా ఏమీ ఉండదు. తెలంగాణ వాళ్లు బుర్రతక్కువ వాళ్లు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…