రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన కొందరు నిత్యం ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉంటూ.. క్రియాశీల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కొద్ది మంది మాత్రం భిన్నంగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామక్రిష్ణ. కామ్ గా ఉండటం.. రాజకీయాల గురించి అట్టే మాట్లాడకపోవటం.. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. చాలా అరుదుగా మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు.అలాంటి ఆయన తాజాగా తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలికి రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సొంతూరు పామర్రు మండలం నిమ్మకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారన్న మాటకు బదులిస్తూ.. ‘ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడు’’ అని బదులిచ్చారు.
ఈ తరహా వ్యాఖ్యలు నందమూరి రామక్రిష్ణ నోటి నుంచి ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు..రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం డెవలప్ మెంట్ లో 40 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. అడుక్కోవటానికి చిప్ప కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడి చేతికి పాలనా పగ్గాలు అందాలన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని.. తాజాగా నందమూరి ఎన్టీఆర్ కుమారుడే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏ రీతిలోరియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on April 13, 2023 10:13 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…