రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన కొందరు నిత్యం ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉంటూ.. క్రియాశీల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కొద్ది మంది మాత్రం భిన్నంగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామక్రిష్ణ. కామ్ గా ఉండటం.. రాజకీయాల గురించి అట్టే మాట్లాడకపోవటం.. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. చాలా అరుదుగా మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు.అలాంటి ఆయన తాజాగా తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలికి రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సొంతూరు పామర్రు మండలం నిమ్మకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారన్న మాటకు బదులిస్తూ.. ‘ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడు’’ అని బదులిచ్చారు.
ఈ తరహా వ్యాఖ్యలు నందమూరి రామక్రిష్ణ నోటి నుంచి ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు..రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం డెవలప్ మెంట్ లో 40 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. అడుక్కోవటానికి చిప్ప కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడి చేతికి పాలనా పగ్గాలు అందాలన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని.. తాజాగా నందమూరి ఎన్టీఆర్ కుమారుడే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏ రీతిలోరియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on April 13, 2023 10:13 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…