రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన కొందరు నిత్యం ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉంటూ.. క్రియాశీల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కొద్ది మంది మాత్రం భిన్నంగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామక్రిష్ణ. కామ్ గా ఉండటం.. రాజకీయాల గురించి అట్టే మాట్లాడకపోవటం.. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. చాలా అరుదుగా మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు.అలాంటి ఆయన తాజాగా తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలికి రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సొంతూరు పామర్రు మండలం నిమ్మకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారన్న మాటకు బదులిస్తూ.. ‘ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడు’’ అని బదులిచ్చారు.
ఈ తరహా వ్యాఖ్యలు నందమూరి రామక్రిష్ణ నోటి నుంచి ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు..రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం డెవలప్ మెంట్ లో 40 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. అడుక్కోవటానికి చిప్ప కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడి చేతికి పాలనా పగ్గాలు అందాలన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని.. తాజాగా నందమూరి ఎన్టీఆర్ కుమారుడే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏ రీతిలోరియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on April 13, 2023 10:13 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…