రాజకీయంగా పేరున్న కుటుంబాలకు చెందిన కొందరు నిత్యం ప్రజాజీవితంలో బిజీబిజీగా ఉంటూ.. క్రియాశీల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కొద్ది మంది మాత్రం భిన్నంగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామక్రిష్ణ. కామ్ గా ఉండటం.. రాజకీయాల గురించి అట్టే మాట్లాడకపోవటం.. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. చాలా అరుదుగా మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు.అలాంటి ఆయన తాజాగా తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలికి రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సొంతూరు పామర్రు మండలం నిమ్మకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారన్న మాటకు బదులిస్తూ.. ‘ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడు’’ అని బదులిచ్చారు.
ఈ తరహా వ్యాఖ్యలు నందమూరి రామక్రిష్ణ నోటి నుంచి ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు..రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం డెవలప్ మెంట్ లో 40 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. అడుక్కోవటానికి చిప్ప కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడి చేతికి పాలనా పగ్గాలు అందాలన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని.. తాజాగా నందమూరి ఎన్టీఆర్ కుమారుడే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏ రీతిలోరియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on April 13, 2023 10:13 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…